పుట:Ammanudi-May-2019.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహిత్యం

కీ.శే. ఇంద్రగంటి హనుమచ్చాస్తి


శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి షష్టిపూర్తి మహోత్సవ సందర్భంలో

శ్రీ ఇంద్రగంటి హనుమచ్చాస్త్రీగారు చదివిన ఉపన్యాసం


కొనలు కొంచెం గిరజాలుగా తేల్చి దువ్విన జుట్టు. వైకల్పికంగా ధరించే కళ్లజోడు. కమీజులోపలికి పెట్టి కట్టిన తెల్లని పంచ మీద నిలువునా బొత్తాలుగల కోటు. ఒక కౌన వీపుమీదకు పోగా రెండవ కొన ముందుకు విడిచిన సన్న ఖండువా, కొంచెం వెడల్పైన పెదవులమీద ఒక చిత్రమైన యాసతో ఉచ్చరించే అచ్చపు తూర్పు, గోదావరి జిల్లా తెనుగు. సడలని ఉత్సాహంతో, వడలని శరీరంతో, రాజమహేంద్రవరం వీధిలో తెనుగుబింకంతో నడిచే ఆ నిండు విగ్రహం ఎవరు?

ఆయనే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్రిగారు. ఉరపు - కలాభివర్ధనీ పరిషత్తు.

ఆయనకు షష్టిపూర్తి అంటే ఎవరు నమ్ముతారు? నేటి సాహిత్య యువకు, లందరికంటే గూడా యువకుడుగా కనిపిస్తూ, పొంగులు వారే ఉత్సాహంతో సాహిత్య సేవ చేస్తూ, ఏ విషయంమీదనైనా ముక్కుమీద గుద్దినట్టు వెర 'పెరుగకుండా మాటలాడుతూ, తెనుగుతనం ప్రసక్తిలో పిడికిలి బిగించి ఉపక్రమించే ఆయన ఎప్పుడూ ముప్పయి దాటని సాహిత్య త్రిదశుడని మా విశ్వాసం గదా - అప్పుడే ఆయనకు అరవై అంటే ఎవరు నమ్ముతారు? “నిజమే...ఆయన రచనాశక్తికీ, సాహిత్యాసక్తికీ, కార్యదీక్షకూ, కళాభిరుచికీ నిత్యయౌవనమే కావచ్చు. కాని : శరీరానికి మాత్రం షష్టిపూర్తి, అన్నాడు మావాడు.

ఉచితజ్జులైన రాజమహేంద్రవర పౌరులు అఖిలాంధ్రదేశ ప్రోత్సాహ, ప్రోద్బలాలతో సుబ్రహ్మణ్యశాస్రిగారికి శక్తివంచన లేకుండా “ఓహో” అన్నట్టు షష్టి పూర్వుత్సవం చేస్తున్నారంటే సారస్వత ప్రియులంతా సంతోషిస్తున్నారు.

ఆంధ్ర వాజ్మయానికి - తత్రాపి - నవ్య సాహిత్యానికీ శ్రీ శాస్రిగారి యీవి తక్కువ కాదు. భక్త విజయం మొదలు కలంపోటు దాకా ఆయన లేఖిని ఆంధ్రసారస్వత క్షేతంలో విశ్చంఖల విహారం చేసింది.

నాటకాలు వ్రాశారు. నవలలు సృష్టించారు. రూపికలు చిత్రించారు. కవిత నారాధించారు. వ్యాఖ్యానాలు ప్రపంచించారు. వ్యాసాలు రచించారు, మీగడతరకలు అందించారు. ఇంకా ఎత్తిన కలం దించలేదు. కొత్తరచనకు పథకాలు పడుతూనే ఉన్నాయి. సాహిత్య రంగంలో ద్రుతగమనం సాగుతూనే ఉంది.

యుగపురుషులు, నన్ని భట్టారకుడూ, వీరేశలింగం పంతులూ మెట్టిన రాజమహేంద్రవర సారస్వత పుణ్య క్షేత్రంలో శాస్త్రిగారి మనుగడ. అటు ్రాబీనసారస్వత సారమూ, ఇటు నవ్య సంస్కార చైతన్యమూ నమన్వయించి ఆస్వాదించిన (ప్రబుద్ధాంధ్రులు శ్రీ శాస్త్రిగారు.

కానైతే... సాహిత్య పూర్వాశమంలో పండిత శ్రీపాద సుబ హ్మణ్య శాస్త్రులవారు చక్కని గ్రాంథీకాంధ్రభాషలో పెక్కు గ్రంథాలు వ్రాశారు. అప్పుడు నలిగిన తోవలో వ్రాసుకుపోయే నలుగురు రచయితల్లోనూ ఆయన ఒకరు...అంతే. ఏ విశిష్టతకూ ఆయన లక్ష్యం కాలేదు. ఏ ప్రత్యేకతకూ ఆయన నిదర్శనం కాలేదు.

ప్రతిభగల వ్యక్తికి ఏనాడో ఏర్పడిన పరిధుల్లో కళ్లు మూసుకుని సురక్షితంగా నడవడం సాధ్యమైన పనికాదు. అప్రయత్నంగా ఆతడు ఎప్పుడో ఎర్రజండా పట్టుకొని గీతలుదాటి బయటపడి తన ప్రజ్ఞకు రెక్కలు తొడుగుతాడు. ప్రజలకు తన ముక్తకంఠం వినిపిస్తాడు.

శాస్రిగారికి ఎప్పుడో ఒకనాడు ప్రజాసామాన్యంతో బెట్టుసరిగా ఉండే గ్రాంధిక భాషమీద పొంగివచ్చే నవ్య చైతన్యవాహినికి ఇరకాటమైన సంప్రదాయ రచన మీద నిర్లక్ష్యం పుట్టింది. దానితో ఆయన మేధలో వింత మెరపులు మెరసీ విచిత్ర భావావళి విరిసింది.

'శోత్రియతా సంపన్నమైన వైదిక కుటుంబంలో పుట్టిన శాస్త్రి గారు, అన్నగారిలా, నిగ్గయిన ఏ దైవజ్ఞ శిభామణిగానో, (శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్థాన యోగ్యతా పరతంతులైన ఏ వేదమూర్తిగానో కావలసింది. అయితే ఆయన పేరు మహేంద్రవాడ పరిసరాలన్ఫూ మహా అయితే రామచంద్రపురం తాలూకానూ దాటకుండానే ఉందేదేమో, కాని ఆయన భవిష్యత్తు అదికాదు. వరినరాలను ఒత్తిగించుకొని ఆయన వ్యక్తిత్వం ఒక నవ్య వాజ్యయ తపస్సిద్ధివైపు అచంచల గమనం సాగించింది.


శాస్త్రిగారు కృషిచేసిన తెనుగు పొలం చాలా పెద్దది. గట్టుమీద నించుని కలయజూస్తే ఆ సస్యాభోగం కంటిని చెదరగొడుతుంది.

30

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019