పుట:Ammanudi-May-2019.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొత ధారావాహిక

జూన్‌ నెల సంచిక నుండి

నంద్యాల నారాయణరెడ్డి రచన

“సాతంత్రకాలం సదువులు”

“అమ్మనుడి చదువరులకు నంద్యాల నారాయణరెడ్డిగారి గురించి, ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హోసూరు ప్రాంత తెలుగు భాషోద్యమంలో వారిది పెద్ద పాత్ర. కృ.ష్ణ.రసం (కృష్ణగిరి జిల్లా రచయితల సంఘం” లో వారిది ముందు నడక. కతలను, కవితలను, వ్యాసాలను, వ్యంగ్య బాణాలుగా భాషోద్యమంలో గురిపెట్టడంలో అందెవేసిన చేయి. ఎనిమిదేళ్ల క్రితం “నడుస్తున్న చరిత్ర" లో వీరు వ్రాసిన 'ఇరుల దొడ్డి బతుకులు” ధారావాహికగా వెలువడి, చదువరుల మన్ననలను అందుకొన్నాయి. అటువంటి మరొక రచన 'సొతంత్రకాల సదువులు' జూన్‌ 2019 నుండి మన “అమ్మనుడి లో ధారావాహికగా రాబోతున్నది. పొరుగు తెలుగు బతుకులలోని ఒక సాంఘిక చరిత్ర ఈ రచన. ఇది కూడ అమ్మనుడి చదువరులను అలరింపజేసి, ఆలోచింపజేస్తుందని మా నమ్మకం.

తమ ప్రాజెక్టులను చేస్తూనే సేకరిస్తున్నారు. కేంద్రం పక్షాన ఒక (ప్రామాణికమైన [గ్రంథాలయాన్ని (ప్రారంభించడానికి చర్యలు చేపట్టడమైంది. 2018 - 2019 ఆర్థిక నంవత్సరంలో 570 ముఖ్యమైన తెలుగు గ్రంథాలను కొనుగోలు చేయడమైంది. వాటిని

భద్రపరచదానికి అవసరమైన 6 అరలను (6 800% గ౭౦19) కొనుగోలు చేయడమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న తాళపత్ర గ్రంథధాలయాల్లోని తెలుగు తాళపత్ర (గ్రంథాలను డిజిటలైజ్‌ చేసి తెచ్చుకొని కేంద్రం వెబ్‌సైట్‌లో పొందు పర్చాలని నిర్ణయించడమైంది. ఆ మేరకు ఆయా (గ్రంథాలయాలకు లేఖలు రాయడం జరిగింది.

ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పరిశోధనాలయం - హైదరాబాద్‌లో కార్యశాల:

2019 ఫిబ్రవరి 11 నుండి 17 తేదీ వరకు హైదరా బాద్‌లోని ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పుస్తక భాందాగారం మరియు పరిశోధనాలయంలో "శాసనాలు, లిపి, తాళపత్ర గ్రంథాల వరిష్క రణపై కార్యశాల నిర్వహించడమైంది. ఇందులో తెలంగాణలోని పూర్వ 10 జిల్లాలలోని పరిశోధక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జూనియర్‌ & డిగ్రీ కళాశాల అధ్యాపకులకు, విశ్వవిద్యాలయాల నహాయాచార్యుల వరకు అవకాశం కల్పించడమైంది. ఆయా అంశాలలో నిష్ణాతులైన వారి చేత ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వడమైంది.

శీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ (ప్రాచ్య లిఖిత పరిశోధనాలయం తిరుపతిలో కార్యశాల:

2019 మార్చి 25 నుండి 31 తేదీ వరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధనాలయంలో 'శాసనాలు, లిపి, తాళపత్ర గ్రంథాల పరిష్కరణపై కార్యశాల నిర్వహించడమైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని 18 జిల్లాలలోని పరిశోధక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జూనియర్‌ & డిగ్రీ కళాశాల అధ్యాపకులకు, విశ్వ విద్యాలయాల సహాయాచార్యుల వరకు అవకాశం కల్పించడమైంది. ఆయా అంశాలలో నిష్ణాతులైన వారిచేత ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వడ మైంది. ఏడు రోజుల శిక్షణ కార్యక్రమాలన్నింటిని వీడియో రీకార్డింగ్‌ చేయడమైంది.

భవిష్యత్‌ ప్రణాళిక:

ఈ కేంద్రం తెలుగు భాషా సాహిత్యం చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన ముఖ్యమైన, విలువైన సమాచారంతో ఒక సంగ్ర హాలయాన్ని (మ్యూజియం) ఏర్పాటు చేయాలని భావించడమైంది. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం జరుగు తుంది. ప్రాచీన తెలుగు సాహిత్యం మీద పరిశోధనాత్మక వ్యాసాలను ఆహ్వానించి కేంద్రం పక్షాన 'తెలుగు సిరి అనే పేరుతో శతైమాసిక పత్రికను (మొదట అంతర్జాలంలో, ఆ తర్వాత ముద్రణ రూపంలో కూడా) తీసుకరావాలని భావించడమైనది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి సంబంధించిన లోగో నమునా (1090 [06061) రూపొందించడం జరిగింది.


తెలుగును బోధించడం కాదు : తెలుగులోనే అన్నీ బోధించాలి

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడె * మే 209 |