అయిదవ అధ్యాయము
53
ఇట్టియధికార మింగ్లీషు ప్రభుత్వమువారు వారికిచ్చిరి. వలన రాష్ట్రములవారు దీనికా గ్రహించుచు వీలయినపు డాంగ్లేయ నాశాసనాధిపతుల నెదిరించి తమ మనుష్యులను విడిపించుకొని తెచ్చుకొనుచుండిరి.
{ఆంగ్లేయ
గవర్నరుల
జీతములు}
ఆంగ్లేయ ప్రభుత్వమువారిచే పంపబడిన గవర్నరు లీవలస రాష్ట్ర ప్రజలమీద నాధార పడి యుండు టకై ప్రతి సంవత్సరమును వారి జీతములను వలస ప్రజా ప్రతినిధి సభలు ని ర్మానించు చుండిరి. ఇట్లు గాక వారికి నిర్నయమైన జీతములను ప్రతినిధిసభల తీర్మా నమునకు సంబంధము లేకుండ చేయు వలెనని యాంగ్లేయ ప్రభు త్వమువారు తలచి. వలసరాష్ట్రములలోనికి దిగుమతి యయ్యె సరకులమీద ఆంగ్లేయ, ప్రభుత్వము పన్నులు విధంచినను ఇక్కడ సుంకమును వసూలుచేయు యుద్యోగస్తులు వలసపౌరులై నందున సుంకమును వసూలు చేయకుండగనే నూటికి తొంబది పాళ్ళు దొంగతనముగా విడిచి పెట్టుచున్నారనియ దీనికేమైన ప్రతీకారము చేయవవలెనన్నీయు కూడ నాంగ్లేయు ప్రభుత్వము యోచించుచుండెను.
వీటికి ప్రతీకారముగ 1763 వ సంవత్సరమున నా గ్లేయ ప్రభుత్వ మువారు "అమెరికాలోని రాజుగారి ప్రజల యొక్క సంగ క్షణకొరకొక ( రివిన్యూ ) పన్నును వారిమీద వేయు న్యాయమును అవసరమునునై యున్నద"ని తీర్మానించి సారాయములు మొదలగు వివిధ సరకుల యమ్మకముమీద ఎగుమతి దిగుమతుల మీదను పన్నులను విధించిరి. ఈపన్ను లలో నుండి తాము నియమించెడి ( గవర్నరులు,) రాష్ట్ర