పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ఆధ్యాయము

37


ఫ్రెంచివారికిని యుద్ధములు జరుగుచుండెను. అపుడు కనడా దేశ వాసులగు పరాసువారికిని ఈపదమూడు వలస రాష్ట్రము లలోని యాంగ్లేయులకును యుద్ధములు జరుగుచుండెను. యూ రవులో సంధి జరిగినపుడెల్ల వీరి యుభయుల మధ్యను, సంధి జరుగుచుండెను. అమెరికాలో జరిగిన యుద్ధములలో సాధా రణముగ పరాసువారు తమ చుట్టునున్న ఎర్రయిండియనుల సహాయమును పొందుచుండిరి. 1756 మొదలు 1768 వరకు జరిగిన ఏడు సంవత్సరముల యుద్దములో ఆంగ్లేయులు జయమొందుటయు కనడా దేశము ఆంగ్లేయ రాజులకు స్వాధీనమగు టయు పైన చూచియున్నాము,