పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

227

పదవ ఆధ్యాయము



పిల్లలు కలిసి పాఠశాలలలోను సర్వకళాశాలలలోను చదువు కొనెదరు. ఆడపిల్లకు వేరు పాఠశాలలు లేననియే చెప్పు వచ్చును. కలిసి దువుకొనుటవలన నష్టమేమియు లేదనియా మర్యాద, పరస్పర గౌరవముగల అభ్యాసములు మాత్రమే పట్టుబడుననియు అమరికావాఎరొ యభిప్రాయము.


ఎర్ర
యిండియనులు


అమెరికనులు పూర్వకాపురస్తులగు ఎర్రయిండియనులతో పొరాడి వారిని నాశనము చేసి లేక తరిమి వేసి సంయుక్త రాష్ట్రుల సంతయు స్వాధీనముచేసికొనుట 1890 వ సంవత్సముతో ముగిసెను. ఆ సంవత్సరము డెకోటాలోని సియోక్సు జాతికి చెందిన ఎర్ర యిండియునులు తమదేశమును తమ కిందనే ఉంచుకొనుట కొరకై బహు దైర్యముతోను నిరాశతోను పోరాడి అమెరిక సులచే పూర్తిగ నాశనము చేయబడి). ఇదియే ఎర్రయిండియనుల ఆఖరు స్వతంత్ర పోరాటము. తెల్లవారు అమెరికా వచ్చుటకు పూర్వము ఎరయిడియములు ఎన్ని కోట్ల మంది అచట కాపురమున్నది చెప్పుట కష్టము, వారిజనాభ' ఎన్నడును తీసుకొని యుండలేదు. కాని దాదాపుగా ఎర్రయిండియను జాతియంతయు తెల్లవారిచే నాశనము చేయబడినదనుటలో అతిశ యోక్తి లేదు. చావగ మిగిలిన రెండులక్షల ఇగుపది అయిదు వేల మంది ఎర్రయిండియులు అమరికనులకు లొంగి సంయుక్త రాష్ట్రములలో కాపురముండుటకు నిర్ణయించబడిన ప్రత్యేక ప్రదేశములలో కాపురముండియున్నారు. వారిస్తితి అమెరికాలోని నీగ్రోల స్తితికన్న హీనముగనున్నది.