సంవత్సరప్రాంతముననో తరువాతనో జరిగియుండును. ఇతడు వీరనృసింహ రాయలవారిచే "స్వామిద్రోహరగండ నూపురమును" బహుమానము గాంచి నట్లుగ నీక్రిందిపద్యము వలన దెలియుచున్నది.
"శా. శ్రీమద్వీరనృసింహరాయనృపతిశ్రేయోదయాసాధిత
స్వామిద్రోహరగండనూపురవిరాజద్రామరాట్తిమ్మభూ
పామిత్యర్జితపుణ్య సత్ఫలసమస్తాశాంతవిశ్రాంతని
స్సీమోర్యిప్రతిపాదనప్రతయశా శీతాంశువంశోనిధీ."
ఆదవేనికొండరాజు
పైపద్యమున వీరనృసింహరాయనిపట్ల ద్రోహబుద్ధితో బ్రవర్తించినవా డెవ్వడో చెప్పకపోయినను, ద్విపదబాల భాగవతమున:-
"విక్రమంబున నాదవేనిదుర్గంబు
విక్రాంతు లెన్న వేవేగ సాధించి
సిరులతో వీరనృసింహరాయలకు
బరుషాత్ము దుర్గాధిపతి నొప్పగించి
గరిమ స్వామిద్రోహగండపెండార
మరిభీకరముగ రాయ లొసంగ నొందె
లాలితకీర్తి విలాసుండు పద్య
బాలభాగవతప్రబంధనాయకుండు."