పుట:Aliya Rama Rayalu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని ఔబిళాంబ, లక్కమాంబ, రంగమాంబ, అమలాంబ, యనుభార్యలు గల రనియు, వారిలో లక్కమాంబకు

       'ఆ రామనృపులక్కమాంబపుణ్యమున
        ధీరత హేమాద్రి తిమ్మభూవరుని
        వరకీర్తి కొండభూవరుని శ్రీరంగ
        ధరణీశు మువ్వురు తనయుల గాంచె.'

     నని ద్విపదబాలభాగవతము నందును,

       "ఆరామనృపతికి మహో
        దారు డగుతిమ్మరాజు ధన్యుడుకొండ
        క్ష్మారమణుడు బుధసుతస
        చ్చారిత్రుడురంగవిభుడు జనియించి రొగిన్."

అని నరపతివిజయమునందును, రామరాజువలన తిమ్మరాజు, కొండరాజు, శ్రీరంగరాజు జనించిరని దెలుప బడినది. భట్టుమూర్తికూడ తనవసుచరిత్రమునం దీమువ్వుర నిట్లభివర్ణించి యున్నాడు.

    "శా. ఆరామక్షితభర్తకుం బ్రధితసత్యాలాపధర్మోద్భవ
         శ్రీరమ్యుండగుతిమ్మరాజు బలలక్ష్మీధామభీమప్రదా
         పారీణుండగుకొండశౌరి విజయప్రఖ్యాతచారిత్రుడౌ
         శ్రీరంగేంద్రుడు గల్గి రైందవకులుక్షేమంకరాకారులై."

వీరలలో జ్యేష్ఠు డగుతిమ్మరాజు, తనవారిలో నసమా