పుట:Aliya Rama Rayalu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        ఆపిన్నభూపాలు డారెవీ డనగ
        నేపారుపురి దన కిరవుగా నిలిచి
        సకలమహీపాల జాలంబు గొలువ
        ప్రకటితతేజుడై రాజ్యంబు జేసె"

అనిమాత్రము చెప్పియుండెనేగాని యతడు స్వతంత్రపరిపాలనము సాగించెనో బుక్కరాయలకు సామంతుడై యుండెనో దెలిపి యుండలేదు. కాని కాలమునుబట్టి విచారించిచూడ గర్ణాటసామ్రాజ్యాధీశ్వరు డగుదేవరాయ మహారాయలకు సామంతుడుగ నుండెనని యూహింప దగును. వీనింగూర్చియు విశేషవిషయములు గానరావు. ఆరెవీడుసోమదేవరాజునకె రాజధానిగ నుండె నని నరపతి విజయమునందు జెప్పియుండిన విషయము సరియైనది కాదని విశ్వసింపవలసియుండును. బాలభాగవతమునందు సోమదేవుని ప్రతాపము నెక్కువగావర్ణించి యుండియు నావిషయము నెంతమాత్రము సూచించి యుండలేదు. సంగతిసందర్భములను బట్టి చూడ సోమదేవునకు నారెవీటికి సంబంధము లేదనియె తలంప నగును. కావున బాలభాగవతమునందు జెప్పినరీతిని సోమదేవుని మనుమనికాలమున నతనిచే నారెవీడు రాజధానిగ జేసికొనబడియె ననుటయే వాస్తవమని గ్రహింప దగును. ఇతనికి నౌబలదేవియందు బుక్కరాజు జనించెను.