వారు కాళ్లు కదల్పలేకపోయి రట. అంతటవారికి గారణము దెలియ వచ్చెనట ! నల్లనిదుస్తులను ధరించి గాంభీర్యతను గన్పఱచెడు నొకమహానుభావుడు మాయెదుట ప్రత్యక్షమై మమ్ము చీవాట్లుపెట్టి తత్క్షణమె మరలిపొండని పలికె ననివారు చెప్పిరట ! అప్పుడు సేనాధిపతులు, అందుముఖ్యముగా విఠలరాయలు మొదలగువారువచ్చి రాజధానికి బోకుండ దారినడ్డగించినఫాదిరి ప్రాన్సిస్గ్షేవియరుయొక్క యాగాంభీర్య దృశ్యమును గాంచి వారుచెప్పిన దంతయు సత్యమేయని భావించి రట. అటువంటి మహాపురుషుని నోటనుండి వచ్చిన యుత్తరువు నాపరాక్రమవంతు డయినమహాశూరు డెట్లతిక్రమింప గలడు ? వెంటనే సైన్యముల వెనుదీయు డనియాజ్ఞాపించె నట ! ఈప్రకారముగా గ్షేవియరు తనప్రార్ధనలమూలమునను కోరికమూలమునను విజయనగరసైన్యముల దండయాత్రనుండి తిరువడిరాజ్యమును సంరక్షించె నట ![1]
ఇయ్యవి పోర్చుగీసుఫాదిరీల దంభోక్తులు ! వీనిని విశ్వసించి హీరాసుఫాదిరి తనగ్రంథమున నెంతోగౌరవ భావముతో నెక్కించి పయిగ్షేవియరుగారి మహిమ నంతయు లోకమునకు బ్రదర్శింపు చున్నారు. విజయనగర సేనాపతులెల్లరును మహావీరులుగాని యఱ్ఱగుడ్డను జూచి బెదరి పాఱిపోవు పసరముల వంటివారు కారు. ఇయ్యదివట్టి యసత్యకల్పనమని నిస్సంశయముగా నుడువ వచ్చును. ఇంతకు నీఫాదిరి
- ↑ The Aravidu Dynasty of Vijianagar, p. 143 - 144