నగరమునాగళ్లతో దుక్కిదున్నించి యాముదాలుచల్లించి రని యాంధ్రకవులు వర్ణించిరి. ఇతడహమ్మదునగరమునువిడిచి యచటికి నలుబదియేబదిమైళ్ల దూరమున నున్న గోదావరినిదాటి పోయె ననియు నచటికి నీసోదరత్రయమును శత్రువర్గమును నురుమాడుటవలన రక్తసిక్తములయిన తమ ఖడ్గములను గోదావరిలోనగడిగి రనికవులువ్రాసిరి. బహుశ: హండేఅనుమప్పనాయడు గోదావరిని దాటి పారిపోవుచున్న కాలముననే బురహాన్నిజాముషాను బట్టుకొని యుండు నని విశ్వసింప వచ్చును. అహమ్మదునగరవినాశము నరపతివిజయ మనుగ్రంథమున నిట్లువర్ణింప బడినది.
"సీ. హరిశౌర్యుడగుతిర్మాలాధీశ్వరుండు ద
దవరజుం డగువేంకటాద్రి రాజు
భుజయుగంబుగ బలస్ఫురణతో గరిహరి
వరవీరభటులతో దొరలతోడ
దనయాజ్ఞ మీఱినకినుక నిజాముపై
దండెత్తి తఱిమి యుద్దండవృత్తి
నత డేలుచున్నట్టి యామదానగరంబు
చాలెత్తి మఱి యామదాలు వేసి.
ఆ. సేతు కాశిమధ్యభూతలనుతజయ
శ్రీవరించివేడ్కచే జెలంగె
రామమూర్తియైనరామరాజేంద్రుడు
సాంద్రవిభవజిత సురేంద్రు డెలమి."