పుట:Adhunikarajyanga025633mbp.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞప్తి

పూర్వము హిందూదేశమందు ప్రజలందరు నాలుగు వర్ణములుగా అనగా బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజింపబడుటచే క్షత్రియులకు తప్ప తదితర వర్ణములకు రాజ్యతంత్రము, పరిపాలన మొదలగు విషయములందు సంబంధము లేకయే జీవించుచుండిరి. శత్రుశిక్షణ, ప్రజారక్షణ క్షత్రియులయొక్క ధర్మమై యుండెడిది. దానివలన తక్కిన వర్ణములవా రెవ్వరు దేశసేవ, పరిపాలన మొదలగు వానియందు పాల్గొనుట, యుద్ధము చేయుట ఎన్నడును చేసినవారుకారు. మొదట అలగ్జాండరు, పిమ్మట మహమ్మదుఘోరీ, తరువాత బేబరు, ఆఖరున ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్చి మొదలగు యూరోపియనులు హిందూదేశముపై దండెత్తినప్పుడు ఎవరోకొందరు రాజపుత్రులు తప్ప తక్కిన జనసమూహము లెవ్వరును శత్రువులతో పోరాడినట్లు కాన్పించదు. అదిగాక రాజ్యము ఏవిధముగానున్నదో పరిపాలన సక్రమముగా జరుగుచున్నదో లేదో వా రెన్నడును గుర్తించెడివారుకారు. విద్యకూడ ఏకొద్దిమందికో తప్ప తక్కినవారెవ్వరికిని లేనికారణముచే ఇటువంటి పరిస్థితు లేర్పడి యుండవచ్చును.

కాని పూర్వపు ఆచారములు, అజ్ఞానము, పరిస్థితులు ఈ కాలమందు మారినవి. ఇదివరకు చాల విజ్ఞానమును