పుట:Adhunikarajyanga025633mbp.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము.

సెనేటుసభ.

ఇప్పటి కమలులోనున్న ముఖ్యమగు ప్రజాస్వామిక రాజ్యాంగములందు, అన్నిటియందు రెండుసభలు శాసననిర్మాణాది కార్య నిర్వహణమునకై ఏర్పరుపబడియున్నవి. అందొక్క సభను "ప్రజాప్రతినిధి సభ" యనియు మరొకటి "సెనెటు" సభయనియు సాధారణముగా వ్యవహరించుచున్నారు. ప్రజాప్రతినిధి సభయందు వోటరులైన వారందరియొక్క ప్రతినిధులు సభ్యత బొందియుందురు. సెనెటుసభయందు ప్రజల యొక్క పెద్దలే ప్రాతినిధ్యత బొందుట సాధారణమై యున్నది. ఆస్ట్రేలియా, అమెరికాదేశములందు వోటరులెల్లరు రెండుసభలయొక్క సభ్యల నెన్నుకొను హక్కు కల్గియున్నను వోటరులెందెవరైనను ప్రజాప్రతినిధి సభాసభ్యత్వమున కభ్యర్ధులుగా నిలబడనగును గాని సెనెటుసభకు ధనికులైనవారుగాని, అనుభజ్ఞులైన వారుగాని, దాదాపు నడివయస్కులైనవారే అభ్యర్థులుగా నిలబడ నర్హులు. కనుక ఒకటి ప్రజల సభయనియు, మరొకటి పెద్దల సభయనియు చెప్పనొప్పును.

ఇన్ని దేశములందును రెండు శాసనసభలు ఒకే కార్య నిర్వహణమునకై యవసరమాయని అనేకులు