పుట:Abraham Lincoln (Telugu).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండెను. కావున నతడును వారివెంబడి వచ్చిచేరెను. అతనిరాక యాభ్రహామునకు మిక్కిలి యానందమియ్య నొకరి కొకరు మిత్రులయి యన్యోన్యముగ మెలగుచుండిరి.

నాల్గవ ప్రకరణము

దుఃఖ దినములు.

తమ మందిరమున నున్నపుస్తుక త్రయంబులును జదివి చదివి క్రొత్తపుస్తుకముల వాసన గానక ఆబ్రహాము వేసారెను. ఉన్న వాతనికి గంఠోక్తిగ వచ్చిపోయెను. నూతన గ్రంథములు చిక్కునా యను చింత యతని హత్తియుండెను. ఇట్టితరుణమున నాతని దృష్టి మరల్చు విషయ మొకటి కడుదు:ఖకరం బగునది సంభవించెను. ఇరుగుపొరుగుల 'స్తన్యరోగ' ఋజ యొండు ప్రబల నారంభించెను. మనుష్యులును పసువులును నద్దాని వాతబడి మరణ మొందిరి. సమీపించి సమీపించి స్పారోల భార్యాభర్తల నది తాకెను. లింకను లడలిపోయిరి. వైద్యు లనేకమైళ్లు గడచినంగాని కానవచ్చుటలేదు. కావున నీ 'మార్గదర్శకుల'యందు స్త్రీలు రోగుల మేలుకీళ్లరసి వారికి దగుసాయ మొనర్చుచుందురు. నాంసీకి దల్లిదండ్రులం బోలు స్పారోలు రోగపీడితులగుట చూచి యామె చాల దు:ఖించి వారిని దమ కుటీరమునకు దీసికొనివచ్చి పరిచర్య లొనర్చు