దైవముం దలంచి ప్రార్థించుచుండును. అప్పుడు జరుగు యుద్ధమున న్యాయము జరుగుగాకనియు వేడుచుండెను.
రెండవకుమారుడు మెల్లమెల్ల నారోగ్యము నందెను. యుద్ధమునందును రాజ్యాంగ మల్ల నల్లన జయించుచు వచ్చెను.
లింకను దన రాష్ట్రపు సైనికులయందలి దురభ్యాసముల మాన్ప మిక్కిలి పాటుపడెను. త్రాగుబోతుతనము బట్టిడు కొనుట యను నీరెండు విషయములగుఱించి చక్కగ నుపన్యసించి వాని రెంటిని నణచుట కుత్తరువులుసేసి వానినెల్ల గట్టిగ జెల్లించుచువచ్చెను.
లింకను యుద్ధభటులయెడ గనుపఱచిన బ్రేమాతిశయ విషయములును, నతడు బానిసలకు ముక్తినొసంగి వారి నాదరించిన తెఱంగును నొక్కొక్క టొక్కొక్కప్రకరణమున కర్హమైనది గాన నిచట బొందుపఱప బడవయ్యెను.
- _______
పదునెనిమిదవ ప్రకరణము
యుద్ధభటులయం దనురాగము.
ఇంతకు బూర్వ మొకప్రకరణమున లింకను బ్లాకుహాకు యుద్ధమునకు సైనికుడుగ వెళ్లెనని వ్రాసితిమిగదా. అతడపు డనుభవించిన కష్టసుఖములు మనమున నుండెగాన