తండ్రిగారి కీజాడ్యమునుండి విముక్తి గలుగు గాకని యెప్పుడు దైవమున కెరగుచున్నాను. అయిన నెట్లుండి యెట్లువచ్చినను దండ్రిగారిని దయా సముద్రుండును, సర్వాంతర్యామియు, సర్వ శక్తుడును నగు నాపరమాత్మను మఱువక యారాధించి యతని మఱుగు జొరు మనుము ........ఇప్పుడు నేనును దండ్రిగారును నొకరిని నొకరు చూచుకొనుట యిద్దఱికి మిక్కిలి దు:ఖప్రదముగనే యుండునుగాని సంతస మియ్యజాలదు. దైవానుగ్రహము తప్పి యత డిపుడు పరలోకమున కేగవలసివచ్చిన నిదివఱ కటకుబోయిన ప్రియబాంధవుల సంతోషముతో గలసి కొన గల్గును. అచిరకాలములోనే నిలువయుండు మేమును నీశ్వరాజ్ఞచే నా యానంద మనుభవింతుము గాక."
- ________
పదునాఱవ ప్రకరణము
గౌరవాధిక్యతం కెందుట.
లింకను న్యాయవాదిత్వమున నుండి సంపాదించిన ప్రజా ప్రతినిధి సభ్యత్వాది విషయముల గుఱించి విశేషము వ్రాయ బనిలేదు. అతడు దేశాధ్యక్షతకు నేమింపబడువఱకు గ్రమక్రమముగ వృద్ధిబొందుచు వచ్చెను. జనుల కందఱ కాతని సద్గుణసంపద విదిత మగుట నెల్లరును దమతమ స్వల్పభేద