ఈ పుట ఆమోదించబడ్డది
మొల్ల
కింకులేన విశాలేన విద్యాహీ నేన దేహినాం
దుష్కులం చాపి విదుషో దేవైరపి సుపూజ్యతే [1]
మొల్ల యాత్మకూరి కేశయసెట్టి కూఁతురు. ఈమె కులాలవంశ సంభూత యని పరంపరగా వాడుక వచ్చుచున్నది. ఆంధ్రమునందు నీమె రామాయణము రచియించినందున నీమెకీర్తి జగములో నజరామరమయి యున్నది. ఈ యువతి 16 వ శతాబ్దారంభమున నున్న ట్లూహింపఁబడుచున్నది.
.......................................గోప
వరపు శ్రీకంఠమల్లేశు వరముచేత నెఱిఁ గవిత్వంబు చెప్పఁగ నేర్చినాను.
అని చెప్పుకొనుటచే నీమె నివాసస్థలము నెల్లూరి మండలములోని గోపవరమని తెలియుచున్నది. ఈమె రామాయణమును చదివినవా రంద ఱీమెకుఁ దెనుఁగునందత్యంతప్రావీణ్య ముండెనని యొప్పుకొనక మానరు. ఈమెకవిత్వము మృదు మధురమయి, 'తేనె సోఁక నోరు తియ్యన యగురీతిఁ దోడ
- ↑ శ్రేష్ఠ మయినకులమునందుఁ బుట్టి విద్య లేకుండిన నేమిలాభము; నీచకులము నందుఁ బుట్టినను విద్యావంతు లయినవారు అందఱికిఁ బూజ్యులు అనఁగా కులము ప్రధానము గాదు; గుణమే ప్రధాన మన్నమాట.