పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

అబలాసచ్చరిత్ర రత్నమాల.

నరిగిరి. అప్పుడు జగన్మోహిని 13 సంవత్సరముల దైనను పతి తోడుత నుండుట యుక్తమని తలఁచి తానును నతనితోడ నరిగెను. ఈ దంపతులు వారియింట నుండఁగా కేశవచంద్రసేనునకు గొప్పవ్యాధి తటస్థ మయ్యెను. ఆవ్యాధిలోనే వారు కేశవచంద్రసేనునియొక్క మిత్రునియింటికి నరుగవలసిన వారైరి. ఆసమయమున జగన్మోహిని చూపినధైర్యము, పతికిఁ జేసిన సేవయు మిగుల స్తుత్యములు. తదనంతరము పరమేశ్వర కృపవలన కేశవచంద్రసేనుల వ్యాధి కుదిరి యతఁడు తనపత్ని సహాయమువలన నేనేకసంస్కరణములను జేయఁగలిగెను. జగన్మోహిని బహుదినములవఱకు బ్రహ్మమతము నవలంబింపక దానిని గూర్చి పతి ననేక ప్రశ్నలువేసి వానికి సమాధానకరములగు నుత్తరములఁ బడసి తన కామతముసంగతి పూర్ణముగాఁ దెలిసినపిదపనే దాని నవలంబించెను. పిదప నీదంపతులకు పుత్రులును, పుత్రికలును గలిగిరి. వారందఱును జననియొక్క పాలనవలన సద్వర్తనము గలవారలైరి. ప్రస్తుతపు కుచ్‌బిహారాధీశ్వరునిభార్య యీమెబిడ్డయే. కలకత్తాయందుజరుగు భారతాశ్రమనుసభ కీమెయేయధ్యక్షురాలుగా నుండెను. దానికేకాక స్త్రీలసభ లాగ్రామమునం దెప్పు డెచటజరిగినను అధ్యక్షస్థానము జగన్మోహినికే యియ్యఁబడుచుండెను.

ఈమెభర్త మరణానంతరము సహితము బ్రహ్మసమాజమునకుఁ జాలసహాయము చేసెను. బ్రహ్మసమాజమునందలి యన్ని శాఖలవారికిని జగన్మోహినీదేవియందు మిగులపూజ్యభావము గలిగియుండెను. ఈమెకు ధర్మప్రచారకులయం దధికాదరము గలిగియుండెను. నవవిధానపక్షప్రాచారకు లీదేవితో