పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విమల

ఈ పతివ్రత ఘూర్జరాధిపతియగు జయశిఖరునికి సహోదరి. ఈజయశిఖరుఁడు క్రీ. శ. 695 వ సంవత్సరప్రాంతమున పంచాసర మనుపట్టణము రాజధానిగా ఘూర్జరదేశము పాలించినట్టు తెలియుచున్నది. ఆసమయమున ఘూర్జరదేశము మిగుల నున్నతదశయం దుండెను. విమల మిగుల రూపవతి యగుటయే గాక, సద్గుణవతియై యుండెను. సకల దేశముల రాజపుత్రులును తమ్మే యామె వరియింపవలెనని కోరుచుండిరి. కాని విమల యైశ్వర్యభోగములయం దిచ్ఛ లేనిదియై గుణవంతుఁడగు శౌర్యనిధిని వరియింప నిచ్ఛగలిగియుండెను.

ఇట్లుండఁగాఁ గొన్ని దినములకు ముల్తానను పట్టణము నందు రాజు భార్యాపుత్ర సహితుఁడయి ప్రభాసక్షేత్రము దర్శించుటకుఁ బోవుచుఁ ద్రోవలో నుండినందున పంచాసరమునకు వచ్చెను. అప్పుడు జయశిఖరుఁడు వారినితనకోటలోనికిఁ గొనిపోయి తగిన మర్యాదలుచేసి కొన్నిదినములు వారి నచట నుంచుకొనియెను. వారచటనుండిన దినములలో నా రాజునకుఁ బుత్రుఁడగు సురపాలునితో జయశిఖరుఁడు క్రీడాయుద్ధము చేయుచుండెను. నంత:పురకాంత లందఱును చూచుచుండిరి. అప్పుడు సురపాలుని శౌర్యసద్గుణములు విమలకుఁ దెలిసెను. అంత నొకదిన మా రాజపుత్రులు సింహమువేట కరుగుచు దానిఁ జూచుటకై విమలతోఁగూడ నంత:పురకాంతల నందఱ నరణ్య