పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గనోరు సంస్థానపురాణి

ఈశౌర్యశాలినియగు సతీరత్నముచేసిన శౌర్యసాహసములు దక్క విశేషచరిత మేమియుఁ దెలియదు. ఈమెపేరేమియో, జననీజనకుల పేళ్ళేమియో తెలిసికొనుటకుఁ బ్రస్తుత మేమియు సాధనములు కానరానందున నామె స్వల్పచరితము నిందుఁ దెల్పెదను.

మధ్యహిందూస్థానము నందలి బోపాలసమీపమున పూర్వము గనోరుసంస్థానమను నొకహిందూరాజ్య ముండెను. మహమ్మదీయులు హిందూస్థానమునకు వచ్చి స్వదేశపురాజుల పాలనలో నుండిన రాజ్యములను తాము స్వాధీనపఱచుకొను కాలములోని చిన్న సంస్థానము కొంతవఱకు ధైర్య మవలంబించి స్వతంత్రముగా నుండెను. మోగలులు డిల్లీ ప్రవేశించి యచటి తురుష్కులను వెడలఁగొట్టఁగా వారు హిందూస్థానము నలుగడలం జేరి వారివారిశక్త్యనుసారముగా రాజ్యములం గెలిచి జనుల ననేక బాధలకు లోను జేసిరి. ఇట్టివారిలోఁ జేరిన యొక మహమ్మదీయుఁడు మధ్యహిందూస్థానమునకు వచ్చి గనోరు రాజ్యమును గెలిచి యచట తనరాజ్యమును నిలుపవలయునని యత్నించెను. కాని యాసంస్థానమును గెలుచుట యాతఁ డనుకొనిట్లు సులభముగాక మిగుల దుస్తరమాయెను. తురకలు తనరాజ్యముపై యుద్ధమునకు వచ్చుట విని గనోరురాజు మిగుల రోషముతో వారితోడ యుద్ధమునకుఁ జనెను. అందు