కమలాదేవి.
185
మరల నాగృహమునందే యుంచి యామె కనేక దుర్భోధలను జేయింపు చుండెను.
ఇట్లుండ దేవీసింహుని జమాదారగు లక్ష్మణ సింహునకు కమలాదేవిపై మిగుల దయకలిగి యామెవృత్తాంతమునంతను నడిగి తెలిసికొని యామెయందు మాతృభావముగలవాఁడయి గుప్తముగా నామె నచటనుండి తీసికొనిపోయి దీనాజ్ పురమునందున్న తనతమ్ముఁడగు రామసింహునివద్ద నుంచెను. తదనంతరము లక్ష్మణసింహుఁడును నుద్యోగము చాలించుకొని దీనాజ్ పురమునకు వచ్చి కమలాదేవికి సేవచేయుచు క్షేత్రనాధుని వెదకుటకు మనుష్యుల నంపెను. ఇంతలో దేవీసింహునిచారులు కమలాదేవిని వెద కెదరని వీరికిఁ దెలియఁగా, సమీపారణ్యమున నొక కుటీరమును నిర్మించి యందుకమలాదేవి యోగినివేషముతో నుంచిరి. అచట నామె కొన్నిరోజులున్న పిదప క్షేత్రనాధుఁడు పొలములను విడుదల చేయించుకొని తల్లికడకు వచ్చెను. అప్పు డాతల్లికొడుకులు కొంతసేపు దు:ఖించి లక్ష్మణసింహునియందు మిగుల కృతజ్ఞత గలవారలై తమగ్రామమున కరిగిరి.