పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరమతి

    స్త్రియస్తథా పాఠనీయా యథా తా: కార్యవస్తుని
    పుంవత్ ప్రవృత్తి మాధాయ సాధయేయు రనాకులా:,*

సంసారరూపమయిన రథమునకు స్త్రీపురుషులు రెండు చక్రములని యందరికిని దెలిసిన విషయమే. ఈ రెండు చక్రములు సమానముగా నుండినగాని, సంసారరథము తిన్నగా నడవదు. రెండుచక్రములలో నెంతెంత భేదముండునో, యంతంత కష్టముగా రథము నడచును. పురుషుడు జ్ఞానవంతుడును, స్త్రీ యజ్ఞానాంధకారమగ్నయు నైనయెడల గుటుంబములో గొంత మాత్రమైనను సౌఖ్యముండనేరదని మనలోని యనేకోదాహరణముల వలన స్పష్టమగుచున్నది. భార్యా భర్తృరూపమయిన రెండు గిర్రలు విద్యాబుద్ధులయందు సమానముగానుండిన పక్షమున సంసారశకటము బహు సులభముగా నడచు ననియు, నడుమ నెన్ని సంకటములు వచ్చినను ఆగక, చక్రద్వయ సహాయముచే సులభముగా గదలు ననియు, తుద కానందముగా నీప్సితస్థలమునకు రథము చేరుననియు జూపుటకు వీరమతి చరిత్ర మత్యంతోపయోగకరమైనది. కాన చదువరులు దీనిని విశేష శ్రద్ధతో జదువవలయును.

శాలివాహన శకాబ్దమందలి రెండవ శతాబ్దముననో, లేక మూడవ శతాబ్దముననో గుజరాతు దేశమున చావడా వంశస్థు


  • "పురుషులవలె ధైర్యము నవలంబించి, భీతిజెందక సర్వకార్యములను నిర్వహించునటుల స్త్రీలకు విద్య నేర్పవలయును."