పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మములను వివరించుచు భర్తకు భార్య మంత్రివలె నాలోచన చెప్పవలెననియు, తల్లివలె నుపచారము చేయవలెననియు, గురువువలె హితోపదేశము చేయవలెననియు, వైద్యునివలె శరీరారోగ్యమును కాపాడవలయుననియు చెప్పియున్నారు.

ఇటువంటి పనులను యుక్తముగా నిర్వహింప గలుగుటకు స్త్రీలెంతటి విద్యావతులుగా నుండవలయునో చెప్పుటకంటె నెవరికి వా రూహించుకొనుటయే సులభముగా నుండును. జ్ఞానమూలమయిన విద్యానిపేక్ష మేహేతువు చేతనో క్రమక్రమముగా మనదేశపు స్త్రీలను విడిచిపోయినది. ఆ విద్యాధనముతో నే వారికిగల సమస్తలాభములును, సమస్త స్వాతంత్ర్యములును క్రమక్రమముగా నశించుచు వచ్చినవి. కడపట స్త్రీలకు విద్య కావలయునా యని సంశయపడునంత దురవస్థ మనదేశమున కిప్పిడు పట్టినది. స్త్రీలు విద్యాహీనురాండ్రగుటచే మూడత్వములో మునిగియుండి సంసార భారమును చక్కగా నిర్వహించుటలో మునుపటివలె పురుషులకు సహాయురాండ్రు కాజాలకున్నారు. అందుచేత పురుషులకు స్త్రీలయందు పూర్వకాలమునందుండెడు గౌరవమంతయు తగ్గిపోయినది. ఏవిషయమునందయినను స్త్రీల నాలోచన యడుగుటయే యనర్థదాయకమని సామాన్యముగా పురుషులిప్పుడు భావించుచున్నారు. అందుచేత పురుషులనేకులు స్త్రీలయొక్క యభిప్రాయముగాని అంగీకారముగాని పొందకయే వారి వివాహమను మిషమీద నంగహీనులకును, వృద్ధులకునుగూడ గట్టిపెట్టుచున్నారు. మానవదేహమున కలంకారమయిన