పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మావతి

     సా భార్యా యా శుచిర్దక్షా సా భార్యా యా పతివ్రతా
     సా భార్యా యా పతిప్రీతా సా భార్యా సత్యవాదినీ.*

పద్మావతి జగన్నాధ నివాసస్థుడగు అగ్నిహోత్రుడను విప్రుని కూతురు. జయదేవుడను మహాకవి భార్య. ఈమె పాతివ్రత్యమునందు మిగుల ప్రసిద్ధిగాంచెను. పద్మావతి మిగుల సౌందర్యవతియు, గుణవతియు నైనందున నామె జనకుడామెకు దగినవరుని విచారించి వివాహముచేయ నిశ్చయించెను. అంత గొన్ని దినంబులకు జగన్నాధమునకు బిల్వాయను గ్రామములో నుండిన నారాయణభట్టను బ్రాహ్మణుని కుమారుడగు జయదేవుడు సకల సద్గుణపరిపూర్ణుడనియు దగిన వరుడనియు దెలిసి నందున బీదవాడని శంకింపక యా యగ్నిహోత్రి పద్మావతి నాతనికిచ్చి వివాహము చేసెను. వివాహానంతర మా దంపతులు మిగుల నైక్యముగలిగి కాపురము చేయుచుండిరి. పద్మావతి తమకు గలదానిలోనే కాపురము మిగుల చక్కగా గడపుచుండెను. ఆమె పూర్వకాలపు పతివ్రతలకథలు చదివియు వినియు దాను వారివలెనే ప్రవర్తించుటకు నెల్లప్పుడు యత్నించుచుండెను. కాన పరమభక్తుడగు జయదేవునకు సంసార మసారమని తోచక మిగుల సారముగా గానుపించు


  • పవిత్రురాలును చాతుర్యవతియునై పతివ్రతయయి భర్త్రనుగ్రహము వడసి సత్యము పలుకునట్టిదియే సద్భార్య యనదగు.