పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాత్యాటోపే సైనికులు మరింత యుత్సాహము గలవారయి శత్రుసైన్యములను నదలింపసాగిరి. కాన సిందేగారి పరాక్రమ మంతయు వృధవోవ నాతడును, దివాను దినకరరావును మరి కొందరు సరదార్లతో దనకు సహాయులగుడని యడుగుటకుగాను ఆగ్రా కిల్లాలోనున్న ఆంగ్లేయుల యొద్ది కరిగెను. విపుల సైన్యసమేతుడగు నొక తరుణ నృపుని నల్పసైన్యముగల యొక యబల తన శౌర్యముచే బారద్రోలెను. ఇందువలననే యొక కవి యిట్లు నుడివెను.

  • 'క్రియాసిద్ధి: సత్వేభవతి మహతాం నోపకరణే'

సిందేగారు పురము విడిచి చనిన వెనుక నాతని రాణివాసపు స్త్రీ లందరు ఆత్మ సంరక్షణముకొరకు నరవర యనుపురమున కరిగిరి. వీరందరు బయలుదేరి కొంచెము దూర మరిగినపిదప సిందే శత్రువులచే బడెనని విని గజరాయను నొక స్త్రీచేత ఖడ్గముధరించి రాజభవనమునకు వచ్చి రాజు సురక్షితముగా వెళ్ళినవార్త విని వెనుకకు మరలెను. ఆహా యీ స్త్రీ యొక్క ధైర్యము అసామాన్యముగదా?

రాజు పలాయితుడయిన వెనుక సకల సైన్యములు తమ కనుకూలము లయినందున పేష్వాగారికి నగరు ప్రవేశించుట కెంతమాత్రము ప్రయాసము కాలేదు. పేష్వాగారంతటితో దాము సార్వభౌముల మయితిమని తలచి పట్టాభిషేక మహోత్సవము గావించుకొని బ్రాహ్మణ సంతర్పణలు చేయ


  • 'గొప్పవారి కార్యసిద్ధి వారి పరాక్రమమువలననే యగును, కేవల సామగ్రి బలమువలన గాదు.'