పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయించిరనియు, అందుపై నామె నదికిపోయిస్నానముచేయగా వెంటనే పూర్వమువలనే కేశములు మొలిచెననియు, అదిగని గురువులును, బంధువులును మిగుల నాశ్చర్యపడి యట తరువాత నామె జోలి మానిరనియు గొందరు చెప్పెదరు. ఏది యెట్లున్నను వెంగమాంబగారికి వితంతుస్త్రీలకు కేశవపనము చేయుట కిష్టములేదనుట వాస్తవము.

వెంగమాంబగారికి నిష్టములేని ఈకృత్యము ఏ స్త్రీలకును సమ్మతంబు కానేరదు. మన దేశమునందు నంధపరంపరగా వచ్చిన యీ యాచారమునకు గాదనలేక కొందరు యువతులు సమ్మతించినటుల నగుపడినను వారి యంతరముల యందు నపిరిమిత దు:ఖము కలిగియే యుందురు. వారివారి భర్తల మరణసమయమున కంటెను కేశవిసర్జన కాలములయందే వా రధికదు:ఖితు లగుచుండిరి. వపనకర్మవలన దమకును, దమ భర్తలకును నిజముగా బుణ్యలోకములు దొరుకునని వారికి నమ్మకమున్నయెడల వారా సమయములయందు దు:ఖించుటకు మారుగా నమితసంతోషమును బొందవలసినదే. స్త్రీలు పతిహీనులై యలంకార రహితులై మంగళకార్యములకు దూరలై మితిమీరిన దు:ఖవహ్నిలో బొరలుచుండ సుఖమునందున్న వారి బంధువులు మంచిమాటలతో వారి శోకాగ్ని నార్పుటకు మారుగా, బర మేశ్వరుడిచ్చిన కిరీట మనదగిన కేశకలాపమును నేలపాలుచేసి యా దు:ఖాగ్నిలో నెయ్యిబోసి ప్రజ్వలింప జేయుదురు. ఇది యెంతటి యన్యాయము. ఈ దురాచారము సహగమనముకంటెను దక్కువ