చేయించిరనియు, అందుపై నామె నదికిపోయిస్నానముచేయగా వెంటనే పూర్వమువలనే కేశములు మొలిచెననియు, అదిగని గురువులును, బంధువులును మిగుల నాశ్చర్యపడి యట తరువాత నామె జోలి మానిరనియు గొందరు చెప్పెదరు. ఏది యెట్లున్నను వెంగమాంబగారికి వితంతుస్త్రీలకు కేశవపనము చేయుట కిష్టములేదనుట వాస్తవము.
వెంగమాంబగారికి నిష్టములేని ఈకృత్యము ఏ స్త్రీలకును సమ్మతంబు కానేరదు. మన దేశమునందు నంధపరంపరగా వచ్చిన యీ యాచారమునకు గాదనలేక కొందరు యువతులు సమ్మతించినటుల నగుపడినను వారి యంతరముల యందు నపిరిమిత దు:ఖము కలిగియే యుందురు. వారివారి భర్తల మరణసమయమున కంటెను కేశవిసర్జన కాలములయందే వా రధికదు:ఖితు లగుచుండిరి. వపనకర్మవలన దమకును, దమ భర్తలకును నిజముగా బుణ్యలోకములు దొరుకునని వారికి నమ్మకమున్నయెడల వారా సమయములయందు దు:ఖించుటకు మారుగా నమితసంతోషమును బొందవలసినదే. స్త్రీలు పతిహీనులై యలంకార రహితులై మంగళకార్యములకు దూరలై మితిమీరిన దు:ఖవహ్నిలో బొరలుచుండ సుఖమునందున్న వారి బంధువులు మంచిమాటలతో వారి శోకాగ్ని నార్పుటకు మారుగా, బర మేశ్వరుడిచ్చిన కిరీట మనదగిన కేశకలాపమును నేలపాలుచేసి యా దు:ఖాగ్నిలో నెయ్యిబోసి ప్రజ్వలింప జేయుదురు. ఇది యెంతటి యన్యాయము. ఈ దురాచారము సహగమనముకంటెను దక్కువ