పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదృష్టవశమున దనకు రాజ్యమును రాజపాలకత్వమును దొరకుటకు సంతసించి యుండక, రాజ్యము తనకే శాశ్వతముగానుండు నుపాయము విచారింపసాగెను. ఇట్లు విచారింపగా రాజపుత్రుని నెటులయిన జంపక తనకు రాజ్యము దొరకదని వాడు తెలిసికొని, యెవ్వరికి నెరుకపడకుండ తానే యా పనిని జేయ నిశ్చయించుకొనెను. ఆ నీచుడు తనకృత్యమించుక బైలపడిన యెడల రజపూతు సరదార్లు తనను దెగజూతురని యెరిగినవాడుకాన, పైకి మిగుల సత్ర్పవర్తనగలవానివలె నగుపడు చుండెను. రాజపుత్రుని నెటులయిన దానుజంపి యాద్రోహమితరులపై నిడి సరదార్ల సమ్మతిచే దానేరాజగు నుపాయము నాతడు యోచింపుచుండెను.

బనబీరుని మనమునందిట్టి ద్రోహము కలదని యేరికిని సంశయమయినను రాకుండెను. గాని యిట్టి పాపవిచారము బైలపడకుండుట దుస్తరముగాన నాతని దుష్టవిచారమంతయు సమీపమునందుండు మంగలివా డొకడు తెలిసికొనెను. వాడును పన్నావలెనే ప్రభు భక్తుడు. వానికి బనబీరుని పరిపాలనమే యసమ్మతము బనబీరుడు తన దుష్టత్వ మెంత గుప్తముగా నుంచినను, పరమేశ్వరుడు ఆ పాపమున కంతకును నీ మంగలివాని నొకనిని సాక్షిగా నియమించెను. బనబీరుడే సమయమునం దేమియాలోచన చేసినను బహు యుక్తులచే నీ మంగలి యప్పుడే దానిని గనిపెట్టుచుండెను.

ఇట్లుండగా నొకనాటిరేయి రాజనగరమునం దంతటను నిశ్చలముగానున్న సమయమున, పన్నా రాజపుత్రుని వానితో