పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మిని

    పత్యనుకూలా చతురా ప్రియంవదయా సురూపసంపూర్ణా
    సహజస్నేహరసాల కులవనితా కేన తుల్యాస్యాత్ *

ఈ పతివ్రతాతిలకము పండ్రెండవ శతాబ్దారంభమునందు జన్మించెను. ఈమె తండ్రి సింహళద్వీప వాసియగు హమీరసింహ చవ్హాణుడు. ఈ సతీరత్న మసమాన రూపవతి యగుటచే జననీజనకు లామెకు పద్మిని యని పేరిడిరి. పద్మిని వివాహయోగ్యయైన పిదప , రజపుతస్థానములోనిదైన మేవాడ్ అను సంస్థానమున కధీశ్వరుడగు భీమసింహ రాణాగారికి నామె నిచ్చి వివాహము జేసిరి. వివాహానంతరము పద్మిని తనరూపమునకుదోడు, సుగుణములు సహాయపడగా భర్తకు బ్రాణతుల్యురాలాయెను.

ఆ కాలమునం దా రాజ్యము రాణాలక్ష్మణసింహుడను బాలరాజు పరిపాలనలో నుండెను. కాని, ఆతడు బాలుడగుటవలన, నాతని పినతండ్రియగు భీమసింహుడే రాజ్యతంత్రములను నడుపుచుండెను. భీమసింహుడు మిగుల శూరుడును, చతురుడును నగుటవలన నాతని రాజ్యమున కంతగా శత్రులభయము లేక, ప్రజలు సుఖముగా నుండిరి. కాని వారి దురదృష్టమువలన స్వల్పకాలములోనే డిల్లీ బాదుషాయగు అల్లాఉద్దీను మేవాడు


  • పతికి ననుకూలయైనట్టియు, ప్రియభాషిణియు, సురూపవతియు నైన కులవనితతో నెవ్వరును సమానులు కారు.