పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీమతి భండారు అచ్చమాంబగారి జీవితచరిత్ర *

    పగలు కడున్ నభోమణి, కపాలిశిరోమణి రే, జగంబు గా
    రగపడునంతకున్ వెలుగునట్లుగ జేయుదు రంతెకాని, యీ
    జగతికి మాటు జెందియు నజస్రము నప్రతిమాన తేజమున్
    దగ గలిగింతురిట్టి వనితామణులే కద! దైవసృష్టిలోన్!

అప్రతీ కాశ పాతివ్రత్యము, ఉదాత్త వైదుష్యము, అనుపమాన స్వదేశప్రీతి, అనిర్వచనీయ స్వజాత్యభిమానము, అనూనదీనవత్సలత, నిర్ణిద్రసత్కార్యాచరణము, నిరంతర సచ్చింత, అసమాన క్షమ మున్నుగాగల సుగుణ గణంబు లొకటికి మించి యొకటి తనయందు వాసముచేయుచుండ, హిందూ దేశమునకు నాయికమణియన విరాజిల్లిన యీ వరవర్ణినీమణిచరితం బనుకరణీయంబును, ఆహ్లాదదాయకంబునునై యొప్పుచున్నది.

మహారాజ్ఞులు, పతివ్రతాతిలకములు, శూరనారీమణులు, విదుషీరత్నములు, పరిశుద్ధ ప్రవర్తనలు, స్వదేశాభిమాన మా నీయలు మొదలగు ననేక సతీరత్నముల సచ్చరిత్రములు బుధజవసంస్తవనీయంబులుగా విరచించి మించిన యీ విదుషీమణి చరితం బెంతటి మాహాత్మ్యసంభృతంబు గాక పోవును!

కృష్ణామండలములోని మునగాల సంస్థానమునకు గ్రీ.శ. 1880 సం|| ప్రాంతములవరకు దివాన్‌గిరీ చేసిన ఆర్వేలనియోగి వంశజులగు కొమఱ్ఱాజు వేంకటప్పయ్య పంతులు గారు శ్రీమతి అచ్చమాంబగారి జనకులు. ఈ మహనీయుడు కేవలాధి కారైశ్వర్యముచేతనే కాక పరోపకార పరాయణత, క్షమ,

  • శ్రీమతి సౌ. పులుగుర్తి లక్ష్మీనరసమాంబగారిచే బ్రకటింపబడు 'సావిత్రీ' పత్రిక నుండి స్వీకరింపబడినది.