పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చన ప్రకారము యుక్తమని తోచగా నామె డిల్లీకి ప్రయాణమయ్యెను. గమన సమయమునం దామె భర్తకు నమస్కరించి "ప్రాణేశ్వరా! తమరు క్షత్రియులు గాన మీ శస్త్రాస్త్రములను గాపాడుకొని యుద్ధమునకు సిద్ధమగుడు, క్షత్రియులు తమదేశముయొక్కయు, వంశముయొక్కయు ప్రతిష్ఠలకొరకు ప్రాణముల విడిచిన నది మృతి యనంబడదు. మనుజుడు జన్మించినందుకు ఫలముగా సత్కృత్యముల జేసి సత్కీర్తిని బొంది అమరుడు కావలయును. తమకు జయము దొరికిన మరల మనమిరువురము సుఖ మనుభవింతుము. లేనిపక్షమున నేనును తమతో స్వర్గసుఖ మనుభవించుటకు శీఘ్రముగనే వత్తును." అని ధీరోక్తులు పలికెను. అందుకు బృథివీరాజు తన భార్యను గౌగిలించుకొని "సతీమణీ! నా దేహములో బ్రాణము లుండునంతవరకు నేను శత్రువునకు వెన్నియ్యనని దృడముగా నమ్ముము. నా సైనికులును కీర్తికాములే గాన వారెప్పుడును పరాజయము బొంది మరల తమ ముఖము లితరులకు జూప నిశ్చయించరని నేను నమ్మెద"నని చెప్పెను. ఆ వాక్యముల విని సంయుక్త "స్వామీ! డిల్లీలోని స్త్రీలు తమ్ముదాము రక్షించుకొనుటకు నసమర్థురాండ్రు గాన, నేనిపు డచటి కరిగి వారి కందరకును ధైర్యము చెప్పెదను. నే నిచటనే యుండిన నా కాంతలేమియు దోచక యుండెదరు. ఏది యెట్లయినను మిమ్మును గెలిచి యా మ్లేచ్ఛుడు డిల్లీకి వచ్చెనా, వానికి రాజపుత్రస్త్రీ యొకతయయిన జీవముతో దొరకనేరదు." అని యామె డిల్లీకిబోయెను. అచట నామె మిగుల నియమముతో బరమేశ్వరుని తనభర్తకు