పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలిందీనదీతీరమునందు జయచంద్రుడు తనసేనలతో దిగి యొకదినము తన శిబిరంబులో గూర్చుండి రాబోవుస్థితిని దలచుకొని సంతోషింపుచుండెను. ఇంతలో నొక సేవకుడు వచ్చి తమ వైరిసైన్యములోనుండి యొకరాయబారి తమతో మాటలాడ వచ్చెననియు, దమ సెలవయినయెడల నాతని నిటకు దోడ్కొని వత్తుననియు జెప్పెను. అందు కాతడాపరిచారకునతో నీ వావలనేయుండి యాతనిని నావద్దికి బంపుమని చెప్పి తాను తన ఖడ్గము చేతగొని కూర్చుండెను.

అంత గొంతసేపటికి నొకతరుణు డచటికివచ్చి జయచంద్రునిపాదముల కెరగెను. ఆవచ్చినయోధుడు పురుషుడుగాక మన కథానాయికయగు సంయుక్తయే. కాన జయచంద్రుడు తనకొమార్తెను గుర్తించి నీ వేమికోరెదవని యడిగిన తోడనే యామె యిట్లనియె. "నాయనా! నేను తమయనుజ్ఞనుబొంది మనదేశమునకు శత్రువగు గోరీనీ జంపగోరి వచ్చితిని. ఈ సమయమునందు బెద్దల యాశీర్వచనము వడసి చనిన తప్పక జయముకలుగును" జయచంద్రుడు కూతుమాటలు విని కొంత తడ వేమియు దోచకుండి పిదప "వోసి స్వేచ్ఛాచారిణీ! ముందుజరుగబోవు ప్రజాక్షేమమున కంతకును నీవేకదా మూలమయినదానవు. పొమ్ము నీ విచటికివచ్చి నాక్రోధమును హెచ్చించితివేగాని వేరులాభములేదు" అని కోపముతో ననెను. అందుపై సంయుక్త మిగులవినయముతో "వోనాయనా! మీరు మీ జన్మభూమివైపించుక దృష్టిసారింపుడు. నిరాశ్రితురాండ్రగు ననేక స్త్రీల మానమును గాపాడుడు. మనమెంత