పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమయమున నా స్థలము ప్రవేశించెను. తా నెన్నడును సంగ్రామము జూడనిదైనను, ఆమెజంకక సమయసూచకత గలదియై తానును యుద్ధముచేసి తన భర్తప్రాణముల గాపాడెను.

సంయుక్త వచ్చిన పిదప పృథివీరాజు బలములు మరల చేరుకొని జయచంద్రుని సేనల నోడించెను. తదనంతరము పృథివీరాజు భార్యసహితుడయి డిల్లీనగరమున కరగెను. ఈ దంపతులిరువురును గొంతకాలమువరకు పరస్పరానురాగము కలవారయి ప్రజలను తమబిడ్డలవలె బాలింపుచుండిరి.

ఇచ్చట జయచంద్రుడు పృథివీరాజు తన సైన్యము నోడించి, తనకూతును గొనిపోవుటవలన సంతప్తహృదయుడయి పగతీర్చుకొన సమయము వేచియుండెను. ఇట్లీ దేశపురాజులలో నన్యోన్యద్వేషములు కలిగిన సమయమున 'శాహబుద్దీమహమ్మద్‌గోరీ' యను మహమ్మదీయుడు హిందూదేశముపై దండు వెడలెను. వాడిచటికి వచ్చి దేశమంతను మిగుల నాశము చేయసాగెను. అనేక దేవాలయముల బడగొట్టి, మునిజనుల నన్యాయంబుగా జంపియు, స్త్రీల పాతివ్రత్యంబుల జెరిచి వారిని తమ దాసులను చేసికొనియు, మహాక్రూరత్వమును జూపదొడగెను. వానిపాదము సోకిన చోటెల్లను నాశ మొందుచుండెను. కాన నట్టి వాని నోడించి పతివ్రతల పాతివ్రత్యమును, మఠమందిరములను గాపాడనెంచి పృథివీరాజు గోరీని శిక్షించ వెడలెను. అప్పుడు జయచంద్రు డొకడుదక్క నితరరాజులందరాతనికి దోడుపడిరి. కోపమే ప్రధానముగా గల జయచంద్రుడు దేశక్షేమముగోరి పృథివీరాజునకు దోడుపడకున్నను, దేశీయుల దురదృష్టమింకను