పుట:Abaddhala veta revised.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎం.ఎన్.రాయ్ - అబ్బూరి లేఖలు

ఆంధ్రప్రదేశ్‌కు ఎం.ఎన్.రాయ్‌ను పరిచయం చేసిన,ఆద్యుడు కీ.శే.అబ్బూరి రామకృష్ణరావు. తొలుత కమ్యూనిష్టుగా ప్రారంభించిన అబ్బూరి, ఆంధ్ర యూనివర్శిటీలో లైబ్రేరియన్‌గా పనిచేశారు.నాట్యగోష్టి, నట్టాలి అనే సంస్థలు 1933 నాటి నుండే స్థాపించి స్టేజి ఆర్ట్స్ పెంపొందించిన ఘనత అబ్బూరివారిదే.

1937 నుండీ ప్రారంభించి చనిపోయేవరకూ, ఎం.ఎన్.రాయ్ తరచు అబ్బూరికి ఉత్తరాలు రాశారు. వాటన్నిటిని ఇప్పుడు వెలుగులోకి తెచ్చిన అబ్బూరి చాయాదేవిగారు, అభినందనీయులు. అయితే అబ్బూరికి వ్రాసిన ఉత్తరాలన్నీ లభ్యం కాకపోవడంతో కేవలం ఒక్క లేఖ ప్రచురించగలిగారు. 1948 ఎం.ఎన్.రాయ్ వాల్తేరు వస్తున్న సందర్భంగా లభించిన ఉత్తరం మాత్రమే ఉంది. 1940 ప్రాంతంల్లో నాటి బ్రిటీష్ పోలీసులు దాడి చేసినప్పుడు అబ్బూరి ఇంట్లో పట్టుకుపోయిన వాటిలో ఉత్తరాలు కూడా తీసుకెళ్ళినట్లు ఆయన కుమారుడు కీ.శే.అబ్బూరి వరదరాజేశ్వరరావు వ్రాశారు. ఎం.ఎన్.రాయ్ అనుచరులలో అబ్బూరి సంతానం ఉన్నది.

1936లో లక్నోలో అభ్యుదయ రచయితల సమావేశం జరిగింది. అందులో అబ్బూరికి మున్షీప్రేమ్‌చంద్‌కూ జరిగిన వాదోపవాదాలు, జైలులో ఉన్న ఎం.ఎన్.రాయ్ దృష్టికి వచ్చాయి. అబ్బూరి గురించి రాజేంద్రదత్తనిగం ద్వారా తెలుసుకొని కమ్యూనిస్టులలో అలా ఎదురుతిరిగి స్వేచ్ఛగా మాట్లాడగలగడాన్ని రాయ్ మెచ్చుకున్నారు. అప్పటికే రాయ్ జైలు నుండి, బయటకు వేసిన రాజకీయ సాహిత్యాని పంచుతున్నారు. హెచ్.ఆర్.మహాజని లక్నోలో అబ్బూరికి రహస్యంగా రాయ్ సాహిత్యం అందించాడు. వాల్తేరు తిరిగివచ్చిన అబ్బూరి కమూనిస్టు పార్టీ సెల్ సమావేశాలలో రాయ్ ప్రస్తావన రాగా, అది చర్చించవీల్లేదని అభ్యంతరాలు వచ్చాయి. రాయ్ పట్ల ఆకర్షితుడైన అబ్బూరి కమ్యూనిస్టు పార్టీకి దూరం అవుతూ రాయ్‌తో సంబంధం పెట్టుకోదలచాడు.

జైలు నుండి విడుదల అయిన ఎం.ఎన్.రాయ్ పైజ్‌పూర్ కాంగ్రెస్ సభలలో పాల్గొన్నాడు. ఈ సమావేశాలకు కాకినాడ నుండి ఎం.వి.శాస్త్రి(ములుకుట్ల వెంకటశాస్త్రి) వెళ్ళారు. కుందూరి ఈశ్వరదత్ మద్రాసు నుండి ఇంగ్లీషులో ప్రచురిస్తున్న ప్యూపిల్స్ వాయిస్ పక్షాన వెళ్ళినట్లు అబ్బూరి వరదరాజేశ్వరరావు ఈ పుస్తకంలో వ్రాశారు.

ఎం.ఎన్.రాయ్ పట్ల ఆకర్షితుడైన ఎం.వి.శాస్త్రి తిరిగొచ్చి, అబ్బూరికి విషయాలు చెప్పి, రాయ్‌ను ఆహ్వానించారు.

నెల్లూరులో 1937, ఆగష్టులో కీ.శే.వెన్నెలకంటి రాఘవయ్య ఆద్వర్యాన ఆంధ్ర వ్యవసాయకార్మికుల సభ జరిగింది. ఎం.ఎన్.రాయ్ దీనిని ప్రారంభించారు. అపుడు రాయ్ జబ్బునపడగా, కాకినాడ వచ్చి విశ్రాంతి తీసుకోమని ఎం.వి.శాస్త్రి ఆహ్వానించారు.కాకినాడ చేరుకొన్న