పుట:Abaddhala veta revised.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతి తెలివిగా ప్రవక్త వచ్చాడు. తనతో దేవుడు అన్నీ చెప్పిస్తున్నాదనీ, కనుక తనను నమ్మి, తాను చెప్పినట్లు నడుచుకోమంటే, జనం అదే నిజం అనుకొని, ఆరాధిస్తున్నారు. ఇదీ అసలు విషయం.

అన్వర్ షేక్ స్పష్టంగా తాను మానవతావాదిననీ, అతీంద్రియశక్తుల పేరిట పాటించదగిందేదీలేదనీ, వివేచనతో మనిషి సాగిపోవాలనీ అన్నాడు. (ఇస్లాం పేజి 149)కొరాన్, బైబిల్, ఇతర "పవిత్ర" గ్రంథాలన్నీ పరస్పర విరుద్ధాలతో వున్నాయి. అవి మనుషుల్ని తప్పు దారిలో నడిపిస్తున్నాయి.

ఇస్లాంలో ముల్లాలు చాలామంది నమ్మకం లేనివారే! కాని ఇస్లాం వారికి కట్టుబాటుగా ఉంది. కనుక అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారని అన్వర్ షేక్ చక్కగా చెప్పారు. (చూడు ఇస్లాం:అరబ్ నేషనల్ మూవ్ మెంట్ పుట 99)

- హేతువాది, డిశంబరు 1999
పోపుగారి పాలు

కేథలిక్ మతాధిపతిని పోప్ అంటారు. ఇతడిని కార్టినల్స్ రహస్యంగా ఎన్నుకుంటారు. ప్రపంచంలో నూరుకోట్ల కేథలిక్కులకు పోప్ బ్రతికున్న దైవదూత. అతది మాటను శిరసావహిస్తారు. ఇంత మంది జనానికి ఆధిపత్యం వహిస్తున్న పోప్ ను రాజ్యాధిపతులు గౌరవిస్తారు. ఓట్ల కోసం రాజకీయ నాయకులు పోప్ మాట వింటారు. ఇది ఆసరాగా తీసుకొని పోప్ తన పెత్తనాన్ని అనేక విధాల విస్తరింపజేసుకోడానికి ప్రయత్నిస్తాడు. ఇది ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచనాటకం.

పోప్ లు గతంలో చేసిన దుర్మార్గాలు, చేయించిన ఘాతుకాలు పెద్ద గ్రంథంగా చరిత్ర చెబుతున్నది.

ఇర్వింగ్ వాలెస్ తన లిస్టులు గ్రంథంలో పోప్ లియో సంభోగిస్తూ మరణించిన సత్యాన్ని పేర్కొన్నాడు. అదొక పరాకాష్ఠ.

మతాన్ని రాజకీయాలతో రంగరించిన పోప్ లు రాజులను తలదన్నే రారాజులుగా చెలామణి అయ్యారు.

ఫ్రెంచి నియంత నెపోలియన్ ఇద్దరు పోపులను జైలులో పెట్టాడు. 7వ పయస్, 8వ పయప్ లు అలా నెపోలియన్ వ్యతిరేకతతో కటకటాలు చూచారు.

19వ శతాబ్దంలో ప్రపంచ వాటికన్ సమితి ఒక నిర్ణయం చేసింది. ఇది 1870లో వెలువడింది. దీని ప్రకారం పోప్ నిర్ణయాలు తిరుగులేనివి. వాటిలో దోషం గాని, లోపం గాని వుండదు.

ఆధునికతను పూర్తిగా వ్యతిరేకించమని పోప్ 10వ పయస్ అందరికీ ఉత్తరువులిచ్చాడు. అలాంటి పోప్ రుషి(సెయింట్) అని పోప్ 12వ పయస్ పట్టం గట్టాడు.