పుట:Abaddhala veta revised.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దారూద్ అనే పేరిట ముస్లింలు మహమ్మద్ ను ఆరాధిస్తారు. నటియకలాం అనే మహమ్మద్ స్తుతిని ప్రత్యక్షంగా పాటిస్తున్నారు. కవాలి కూడా మహమ్మద్ స్తుతిగానే సూరాలు ప్రచారంలో పెట్టారు. అల్లాతోబాటు మహ్మద్ ను చేర్చి షహాదా ప్రమాణం చేస్తారు.

కొరాన్ ప్రకారం అల్లాతోబాటు ఇంకెవరిని చేర్చినా తప్పుగా భావించాలి. దీనికి భిన్నంగా మహమ్మద్ ఆచరణ పేరిట సాధించాడు.

నమ్మకాల గురించి హేతుబద్ధంగా ఆలోచించరాదంటూ మహమ్మదు తెలివిగా తన స్థానాన్ని కాపాడుకున్నాడు. తనను అనుకరిస్తే లాభిస్తుందన్నాడు.

ప్రవక్త అనే భావన మానవుడి తెలివితేటలకు నిదర్శనం. ప్రవక్త చేతిలో దేవుడు కీలుబొమ్మ.

తన కోర్కెలను,లక్ష్యాలను సాధించడానికి దేవుడిని అడ్డం పెట్టుకోవడమే ప్రవక్త చేసిన గొప్ప నాటకం. ఇది అందరు ప్రవక్తలకూ వర్తిస్తుంది.

మహమ్మదు చాలా తెలివిగా కొరాన్ ను వాడుకున్నాడు. తానే చివరి ప్రవక్తను అని చాటుకోవడం అతడి తెలివికి పరాకాష్ఠ. అరబ్బు సామ్రాజ్యవాదానికి పితామహుడు మహమ్మదు ముస్లిం జాతీయవాదం ప్రారంభించాడు. దీని ప్రకారం ప్రపంచంలో ముస్లింలు ఎక్కడున్నా, అరేబియా ఔన్నత్యాన్ని గుర్తించాలి. అదే వారి పవిత్ర మాతృ, పితృభూమి, వారుండే దేశం రెండో స్థానంలో వుంటుంది. జీవితంలో ఒక్కసారైనా అరేబియా యాత్ర చేసి రావాలనే నమ్మకం కలిగించారు. అన్వర్ షేక్ సూత్రాన్ని విడమరచి, ఉదాహరణగా భారతదేశాన్ని స్వీకరించాడు. ముస్లిం లు ఇండియాలో తమ మసీదులను, చారిత్రక కట్టడాలను, ద్వితీయ స్థానంలో వుంచి, అరేబియా వైపు చూడడం ఇస్లాం సామ్రాజ్యవాదంగా చెప్పాడు. దీనివలన రాజకీయ, సామాజిక సంఘర్షణలకు దారితీయడాన్ని ఉదహరించాడు. అలానే ఇతర దేశాలలోనూ జరుగుతున్నది. తమ దేశంలో సంస్కృతిని, నాగరికతను, ఆచారాలను, తక్కువగా చూడడం, అరేబియా సామ్రాజ్యవాదంలో అంతర్భాగమే. ఇది ముస్లింలు ఆలోచించాల్సిన ముఖ్య విషయం.

సాంస్కృతికంగా ముస్లింలు అరేబియా బానిసలుగా మారడానికి ఇస్లాం కారణమని అన్వర్ షేక్ నిర్ధారించాడు. అరబ్బు సంస్కృతిని మాత్రమే పాటించిన మహమ్మదును ముస్లింలు అనుకరించి, ఆరాధించినంత కాలం యీ వైవిధ్యం తప్పదంటున్నాడు.

"ప్రవక్త" అనేది మానవుడి కల్పన అని, రుజువుకు, ఆధారాలకు నిలబడేది కాదని అన్వర్ షేక్ కుండబద్దలు కొట్టాడు. దేవుడి పేరిట నాటకమంతా ప్రవక్త ఆశి, జనం మూఢనమ్మకాన్ని బాగా దిమిస కొట్టాడన్నారు.

దేవుడిని నమ్మేజనం ఎలాగూ అతడిని కనలేరు, వినలేరు, మాట్లాడలేరు. ఆ స్థానంలోకి