పుట:Abaddhala veta revised.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశభక్తి, మాతృదేశం అన్నీ ఏమౌతాయి? ఇస్లాం ప్రకారం ముస్లింలందరూ అరేబియాను మాత్రమే పవిత్రంగా భావించాలి. ముస్లిం తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, ఎవరైనాసరే ఇస్లాంను పాటించకపోతే, వారిని ద్వేషించాలి. ఇస్లాంను స్వీకరించేవరకూ ముస్లింలు తిప్పలు పడాలి. అందుకుగాను టెర్రరిజం ఆచరించినా, చంపినా, దోచినా, నరికినా, మోసగించినా ఫరవాలేదు. అంతిమలక్ష్యం ఇస్లాంగా మారడమే.

ఇస్లాంను వ్యాపింపజేసే ప్రయత్నంలో ముల్లాలు (మతగురువులు) కీలకపాత్ర వహిస్తున్నారు. కీలకమంతా వారి చేతులో వుండడం వలన ఎన్నికైనవారు సైతం వారికి అడుగులకు మడుగులు వత్తాల్సి వస్తున్నది.

ఇస్లాంను వ్యతిరేకించే వారిపై ఫత్వాలు జారీచేసి, రచయితల, తాత్వికుల స్వేచ్ఛను అరికడుతున్నది ముల్లాలే.

ముల్లాలు ఇస్లాం ను పాటిస్తున్నారా? లేదు. వారే ఇస్లాంకు ద్రోహులు.

కొరాన్ లో స్పష్టంగా "మత నిర్బంధం కూడదు" అనీ, "నిజంగా నిలబడదలిస్తే నీ వాదన రుజువు చేసుకో" అనీ వుంది. (Cow : 111)

కొరాన్ ప్రకారం క్రైస్తవులు, హిందువులు, బౌద్ధులు, సిక్కులు, నాస్తికులు, యూదులు అంతా అపనమ్మకస్తులే. వారంతా నరకానికి పోతారు.

ఇస్లాంలో అతిప్రధాన విషయం ప్రవక్త. మహమ్మద్ సమకాలీనులలో తాలిహ, ముసేలిమా అల్ అస్వాద్ అనేవారు తాము ప్రవక్తలమన్నారు. చివరకు పోరాటంలో మహమ్మద్ నెగ్గి నిలిచాడు. జనాన్ని సమ్మోహనంలో పడేయడానికి ప్రవక్త అనేది చక్కని సాధనం. దేవుడు అందరితో మాట్లాడడు. ఎవరికీ కనిపించడు. కనుక తనతో మాట్లాడాడనీ, తన ద్వారా ఆయన సందేశం అందిస్తున్నాడనీ అంటే ప్రవక్త మాటల్ని జనం నమ్ముతారు.

దేవుడు ఒక వ్యక్తిని నియమించినట్లు ఆధారాలు ఏమీ వుండవు. రుజువుకు నిలబడవు. నమ్మేజనం రుజువులు అడగరు. దేవుడు నాకు కనిపించి చెప్పాడంటూ ప్రవక్తలు నమ్మించేవన్నీ తెలివిగా ఆడే అధికార రాజకీయ నాటకమే.

అన్వర్ షేక్ తన "ఇస్లాం" రచనలో మహమ్మదు గురించి వివరంగా పరిశీలించి, ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపెట్టాడు.

అల్లాను పక్కనబెట్టి మహమ్మదుకే ప్రాధాన్యత సంతరించేటట్లు చేయడం కీలక విషయం. రాజకీయవాదిగాను, జాతీయ సామ్రాజ్యవాదిగాను మహమ్మద్ తన గొప్పతనాన్ని నిలబెట్టుకున్నాడు.

ముస్లింలు రోజూ చేసే ప్రార్ధనలో మహమ్మద్ ను స్తుతించడం అంతర్భాగం.