పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నికి సూపరింటెండెంటు పదవిని అందుకొన్నాడు. భాగస్థుడైనాడు. చివరకు ఇతడుకూడా కోటీశ్వరుడయినాడు.

స్కాట్లండులోని హైలాండ్సును స్మృతికి తెచ్చే పెన్సిల్వేనియాలోని క్రెస్సన్ దగ్గర, కేవలం ఎలిఘనీస్ శిఖరం మీద, కార్నెగీ ఒక కుటీరాన్ని కొన్నాడు. వసంతపు తొలిచిహ్నాలు కనిపించగానే అతడు, అతని తల్లి అతివేగంగా అక్కడికి వెళ్ళేవారు. న్యూయార్క, పిట్స్‌బర్గులకు మధ్య మధ్య అతివేగ ప్రయాణాలు చేస్తూ మాసమో మరికొంత కాలమో అక్కడ గడిపిన తరువాత సెలవలకని వారు స్కాట్లండుకో, యూరప్‌కో పోతూ వుండేవాళ్లు వేసగి చివరిదశలో తిరిగివచ్చిన ఆ సాంధుడు లేదా పాంథు లిరువురూ మళ్ళీ క్రెస్సన్‌కు వెళ్ళి అక్కడనే ఆకురాలు కాలం వరకూ వుండేవాళ్ళు.

క్రెస్సన్‌కు వెళ్ళి కార్నెగీ గోదాముతో ప్రవేశించబోతున్నప్పుడు పలుకా కట్టుకొన్న ఒక యువకుడు, పదునై దేళ్లవాడు తనంతట తానే వచ్చి, అతని గుర్రాన్ని పట్టుకొనేవాడు. అశ్వారోహణముచేసి తిరిగి వెళ్ళిపోతూ ఆ 'ఉక్కు-అధిపతి' ఇచ్చిన పదిసెంట్లో పావు డాలరో పారితోషికాన్ని పుచ్చుకొని ఈల వేసుకొంటా అతడు అక్కడనుంచి అంగలమీద వెళ్ళి పోతుండేవాడు. క్రెస్సన్ కు అతని నివాసనగరమైన లొరెట్టోకు మధ్య ఉన్న కొలది మైళ్ళదూరం ఆ కుర్రవాడు అతివేగంగా పయనించేవాడు. అయితే కార్నెగీకి అప్పుడు అతడి పే రేమిటోకూడా తెలియదు. కానీ తరువాత తెలుసుకొనే సమయం వచ్చింది.