198
ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక.
సించి విభుండు దా నొకట సేవకుఁడై మనుకంటె ముందఱా
ర్జించినకీర్తి నిల్వ గతి సేకుఱఁగా ననిచావు సేగియే."
అని కవియే తనకుమారసంభవమునఁ జెప్పియున్నాడు. తత్పూర్వము రాజ్యపదభ్రష్టుడై యజ్ఞాతవాసము చేసి మరల లబ్ధరాజ్యుఁడై కొంతకాలము రాజ్యము చేసెను. ఇతనితండ్రి చోళపల్లి; తల్లి శ్రీపతి. ఇతఁడుకుమారసంభవ మనుపదిరెండాశ్వాసముల గ్రంథమును రచించెను. ఇది కాళిదాసు కావ్యమునకుఁ దెనుఁగు గాదు. ఆంధ్రభాషలో నూతన కావ్యసృష్టికి నిఁతడె ప్రాథమికుఁడు. దీనిలో గణపతిజననము, సతీదహనము, మదనసంహారము, పార్వతీవివాహము, కుమారోదయము, తారకాసురయుద్ధము, తత్పరాజయమును వర్ణింపఁబడినవి. ఈకవిశిఖామణికావ్యములోని వర్ణన లత్యద్భుతములై నూతనములై యున్నవి. ఏతత్కృతి చాలఁ బ్రాచీనమైనను సకలకావ్య లక్షణములకుఁ బుట్టినిల్లగుటచే నప్పుడ మెఱుగిచ్చి తీర్చినచిత్రమువలె మనోరంజకముగా నున్నది. రాజకవులలోను గవిరాజులలోను నిట్టివాఁడు లేఁ డనుట యంత యతిశయోక్తి గాదు. దీనిలో నుండి కొన్నిపద్యము లుదాహరించెదను.
మదనదహనసమయమున : _
క. కని కోపించెనొ కానక,
మును గోపించెనొ మహోగ్ర ♦ ముగ నుగ్రుఁడు సూ
చినఁగాలెనొ చూడక యట
మును గాలెనొ నాఁగ నిమిష ♦ మున నఱగాలెన్
క. గిరిసుతమైఁ గామాగ్నియు
హరుమై రోషాగ్నియుం ♦ దదంగజుమై ను
ద్ధురకాలాగ్నియు రతిమై
నురుశోకాగ్నియును దగిలి ♦ యొక్కటనెగసెన్.
రతిసహగమనోద్యుక్తయై చితిఁ జొరఁజనునప్పు డాకాశవాణి యాత్మహత్య వారించిన శోకాగ్నితప్త యగుచు : _
క.కరువునఁ బూరితమై లో,
హరిసము లోఁ గాలునట్టు ♦ లంగజుశోకో
ద్ధురశిఖి రతితను విమ్ముగ,
గరగియుఁ బొడపఱక లోఁనఁ ♦ గాలుచు నుండెన్.
సీ. అలమట సెడి యుండె నిలువదు చిత్తంబు,
మూర్ఛిల్లి వెడఁబాసి పోవదొండ
నూఱట గొనయొండె నాఱదు శోకాగ్ని
వొరిమాలఁ గొని కాలిపోవ దొండె
ఘర్మాశ్రుజలము లొక్కటఁ గట్టుకొననొండె
బొడవంతయుఁ గరంగి పోవదొండె
బర్వునిట్టూర్పులు పట్టునఁ బడవొండెఁ
బొం దిమ్ముగాఁ బాసి పోవదొండె
నిట్టికడలేనిదు:ఖాబ్ధిఁ బెట్టిముంపఁ
దలఁచియో కాక పోనీక బలిమి నాదు
ప్రాణ మొడలిలో నాకాశవాణి దెచ్చిఁ
మగుడఁ జెఱఁబెట్టె నని రతి మఱగుచుండె.
వీరపురుషులు యుద్ధమునకు వెలువడుచుండ నొక వీరపత్ని పచ్చవలువయుఁ గంరమాల్యములును వీరమద్దియలును ధరించి నిశ్చితహృదయుం డగుపతిం గనుంగొని చెప్పుచున్నది.ఁ
ఓలములేదుకూర్చునని యూఱడియుండితిఁ గూర్మియెల్లనేఁ,
డాలముసేసి నన్నుఁబెడయాకులఁ బెట్టి మన:ప్రియుండు త
న్నాలములోనఁ బెట్టి దివిజాంగనలం గలయంగ నెత్తె ఁనే
నాలనె బేల గాక చెలియా యని నెచ్చెలిమీఁదవాలుచున్
ఈకవి సర్వజ్ఞుఁడు.
(2) భద్రభూపాలుడు. (క్రీ.శ. 1150
ఇతఁడును నన్నెచోడునివలె "రవికులశేఖరుండుఁ గవిరాజశిఖామణి" ఇతఁడే సుమతిశతకమును నీతిశాస్త్రముక్తావళియు రచించినవాఁడు. కవిబ్రహ్మ యను బిరుదు గలవాఁడు.
క. శ్రీవిభుఁడ గర్వితారి, క్ష్మావరదళనోపలబ్ధ ♦ జయలక్ష్మీసం,
భావితుఁడ సుమతిశతకము, గావించినప్రోడఁ గావ్య ♦ క
మలాసనుఁడన్.
అమృతాంజనము:- వేలకొలది సన్మానపత్రములు! వేలకొలది బుడ్లు ప్రతివారము విక్రయము. వెల 0-8-0.