పుట:Aandhrakavula-charitramu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

ఆంధ్ర కవుల చరిత్రము

అని యిట్లు రేచనను బొగడియు, కొన్నిచోట్ల

      సీ. ప్రాసంబు నాలుగు పాదంబు లందును
                     బన్నుగా నిడి పెఱపాదములను
           బ్రాసంబు లిడక తత్పాదంబులం దెల్లఁ
                     బన్నుగా వడు లిట్లు పరఁగ నిలిపి
           తెలిసి తెలుంగునఁ దియ్యనినుడువులఁ
                     దెల్లంబుగా నర్థదృష్టి దెలుపc
           బ్రాససీసము దీని పశ్చిమార్ధంబునఁ
                     బ్రాసంబు వేరొక ప్రాసమైన

             శ్రీసమేతుఁడైన శ్రీపాదపంకజ
             వాసమధుకరుండు వాసవప్ర
             హాసభాసి రేచఁ డను పండితుం డిటు
             ప్రాససీస మరసి పఁరగఁ జెప్పె.
          
                          (కవిజనా - జాత్యధికారము 16 )

అని రేచcడు రచించినట్లు చెప్పియు, నానావిధ పద్యములను జేర్చియున్నాడు. ఇట్టి భీమకృతమైన కవిజనాశ్రయములోని యతిచ్ఛందోధికారమునందు

        క. ద్వీపమునకు నాకమునకు
           నాపై శాస్త్రోక్తి నచ్పు లా దేశ సమా
           సాపత్తి గలుగుటయు వళు
           లాపాదింపుదురు కొంద ఱచ్చును హల్లున్. 86

అను లక్షణమును జెప్పి లక్ష్యము లనుగఁ గావ్యాలంకార చూడామణి నుండి

       ఉ. ద్వీపుల ద్రుంచి విశ్వజగతీపతి యుత్తమశక్తి జాంబవ
           ద్వీపమునందు గోవులకు నిమ్ముగఁ జేయుటకుం బ్రసన్నయై
           గోపతిధేను నవ్విభునకుం దనవైభవ మిచ్చెఁ గాక యే
           భూపతు లీ వదాన్యగుణబుద్ధుల నిట్లు వహించి రుర్వరన్.