పుట:Aandhrakavula-charitramu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

53

నన్నయభట్టు


నీయెడ నావుడు నట్టుల
చేయుదు నని నలుఁడు వాని సేవించెఁ దగన్.
          [ఆరణ్యపర్వము. ఆ. 2-130 ]

అని నన్నయభట్టారకుఁ డారణ్యపర్వమునందు వర్తమానార్థమున "పడి యెడు" ననియు భవిష్యదర్ధకమున 'చేయుదు' ననియు, వాడియున్నాఁడు ఈ ప్రకారముగానే సభాపర్వమునందును

     చ. ఇది యుచితంబుగాదనక యిక్కురు ముఖ్యుఁడు చూచుచుండ దు
         ర్మదుఁడయి వీఁడు నన్ను నవమానితఁజేసెడి, సర్వధర్మ సం
         విదు లన నున్న యీ భరతవీరులవంశము నేఁ డధర్మసం
         పద నతినింద్య మయ్యెనని భామిని కృష్ణుఁ దలంచె భీతయై
                                                   [ఆ. 2- 219 ]

 అని వర్తమానార్థమునఁ "చేసెడి" ననియు.

    మ. కురువృద్దు ల్గురువృద్ధబాంధవు లనేకుల్ చూచుచుండ న్మదో
         ద్ధురుఁడై ద్రౌపది నట్లుచేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
         కరలీల న్వధియించి తద్విపులవక్షశ్శైల రక్తౌఘ ని
         ర్ఝర ముర్వీపతి చూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్
                                                   [ఆ. 2 - 233 ]

అని భవిష్యదర్ధమున "నాస్వాదింతు" ననియు, ప్రయోగించెను ఈ రీతినే యాదిపర్వమునందును

    చ. అమిత జగద్బయంకర విషాగ్నియు నవ్రతిహన్యమానవీ
         ర్యముఁ గలయట్టి సర్పముల కా జనమేజయు చేయు సర్పయా
         గమున నుదగ్రపావక శిఖాతతులం దొరుఁగంగఁ గారణం
         బమల చరిత్ర ! యేమి చెపుమయ్య వినం గడు వేడ్క యయ్యెడున్.

ఆని వర్తమానార్థకమున 'నయ్యెడు" ననియు

     క. తనసతి కపకారము చే
         సిన పాముల కలిగి బాధ చేయుదు నని చి