పుట:Aandhrakavula-charitramu.pdf/729

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

702

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

మొత్తముమీఁద రసవంతమయి పండితజనశ్లాఘపాత్రముగా నున్నది. ఈతని శైలి తెలియుటకయి పరత త్త్వరసాయనములోని పద్యములఁ గొన్నిటి నిందు క్రింద నుదహరించుచున్నాను.

మ. చిరమై నిర్మలమై మహావిభవమై చిన్మాత్రమై సత్యమై
     పరమై సంతతసంయమీశ్వరమనఃప్రత్యక్షమై నిత్యమై
     దురితారణ్యదవార్చియై మదిని భక్తుల్గోరునర్థంబునై .
     స్థిరభావంబునఁ దోఁచు బ్రహ్మము మదిన్ సేవింతుదత్త్వార్థినై.

చ. అవికలభక్తి నెవ్వని మహాత్ములు చిత్తములందుఁ జేర్చి బా
    హ్యవిరతిఁ బూని సత్కృతి సమర్పణ లొప్పఁగ నర్థిఁ జేయుచుం
    దవిలి సమాధియోగములఁ దత్పరులై భజియించి మృత్యుపా
    శవిరహులై సుఖింతు రనిశంబును నా హరి కేను మొక్కెదన్.

                     మత్త కోకిల
    పాయరాని యపాయమున్ బహుపంకహేయ మమేయదో
    షాయనంబు విషాదసంహిత మంతికస్థితమృత్యు వీ
    కాయ మేమి నిజంబు ? నమ్మఁగఁ గాదు దీనిని జంచలం
    బేయడన్ సతమండ్రు బుద్ధివిహీనచిత్తులు మూఢతన్ ఆ.2
  
చ. మదమున దుర్జనుం డితరుమాన మెఱుంగక నింద సేయుఁ బెం
    పు దఱుఁగు కిల్బిష క్రియలఁ బూని యొనర్చును సాధు సేవకుం
    గుదురఁడు సద్గుణాళి మదిఁ గూరఁడు దుర్విషయాభిలాషలం
    బొదలెడిఁ గాని సద్గురుసు బోధితమార్గము నంట డెన్నడున్

ఉ. ఓ మహితాత్మ! నీకరుణ నుజ్జ్వలమైన వివేక మాత్మ్యమై
    మామకచిత్తసన్నిహితమంజులమై మది గల్క దేఱ లోఁ
    దామసవృత్తి మానె హరితత్పరమౌచు మనంబు గోరెడిన్.
    నీ మహనీయవాక్సురభినిర్గతదేవమహత్వతత్త్వముల్ ఆ. 3.