పుట:Aandhrakavula-charitramu.pdf/725

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫణిభట్టు


ఈ కవి పరతత్త్వరసాయనమును నైదాశ్వాసములవేదాంత గ్రంథమును రచించెను. ఇందు ప్రధమాశ్వాసమున కర్మయోగప్రకారము, ద్వితీయాశ్వాసమున ననాత్మవివేకము, తృతీయాశ్వాసమున నాత్మవివేకము, చతుర్దాశ్వాసమున యోగత్రయలక్షణము, పంచమాశ్వాసమున రాజయోగప్రకారము చెప్పఁబడినవి. శ్రీ మహాభారతమునందు భీష్ముడు ధర్మరాజున కుపదేశించినట్లున్న హరసనత్కుమారసంవాదమునే తాను ప్రబంధరూపముగా రచించినట్లు కవి చెప్పెను గాని భారతమునందలి హరసనత్కుమారసంవాదములో నిందలి యుపదేశములు గానరావు. ఈ కవి సకలవేదాంత సిద్ధాంతమైన యద్వయ బ్రహ్మవిద్యారహస్యమును తన కుపదేశించిన సదానందయతి కీ కావ్యము నంకిత మొనర్చెను. సదానందయోగి తన గృహమునకు విచ్చేసి తనవలన నర్ఘ్య పాద్యాదిసంపూజనముల నొంది తనకు వేదాంతోపదేశము చేసినట్లు కవి చెప్పుకొన్నాఁడు.

      గీ. ఏ మునీంద్రుని కరుణామయేక్షణంబు
         లాశ్రితాఘౌఘరోగరసాయనంబు
         లాతఁ డలరసదానందయతి యనంగ
         నవనిం బెంపొందు భువనత్రయంబుఁ బొగడ


         **** **** **** **** ****


      గీ. తనదుసల్లాపరుచి పార్శ్వ జనులశ్రుతుల
         దప్పి దీర్పంగ వేంచేసెఁ దగ మదీయ
         మందిరంబున కల సదానందమౌని
         విభుఁడు మత్పూర్వభవపుణ్య' భవమునను.

ఈకవి తన వంశము నిట్లు చెప్పుకొనెను--

     క. శ్రీకరకవిత్వవిద్యా
        సాకల్యం బఖిలశాస్త్ర చతురము నిగమ