పుట:Aandhrakavula-charitramu.pdf/721

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

684

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

               బసిడిపోలేరమ్మ భవునికొమ్మ
      పాపవినాశియై ప్రవహించు నే వీట
               మన్నేఱు మిన్నేటిమార టగుచుఁ

      గుంజరములు వేయి కొలువంగ నేవీటఁ
      గొడగుచక్రవర్తి పుడమి యేలె
      నట్టి రాజధానియై యొప్పు గుడ్లూరి
      నొనర నేలుచుండి యొక్కనాఁడు.

  సీ. వేదాంతవిదులైన విద్వాంసు లొకవంక
                నుభయభాషాకవు లొక్కవంక
      సకలాప్త బాంధవ సంబంధు లొకవంక
                నుద్దటుమన్నె కొమారు లొక్కవంక
      నీతికోవిదులై న నెఱమంత్రు లొకవంక
                నుద్దండరణశూరు లొక్కవంక
      సంగీతసాహిత్యసర్వజ్ఞు లొకవంక
                జొక్కంపుభరతజ్ఞు లొక్కవంక

      రాజురాజులు పంచిన రాయబారు
      లొక్కవంక విలాసిమ లొక్కవంక
      బలసికొలువంగ నతులవైభవముతోడ
      రమణఁ గొలువుండి బసవయరాఘవుండు.

ఈ పద్యములపయి గద్యమునందు రాఘవరెడ్డి "రావూరిపురాధీశ్వరుఁ" డని చెప్పఁబడినది. రావూరు గుంటూరునకును, కొండవీటికిని మధ్యను గుంటూరుమండలమునందున్నది. గుడ్లూరు నెల్లూరుమండలములో పాకనాటిసీమలోని కందుకూరుతాలూకాలో నున్నది.
కృతికర్తయైన వెన్నెలగంటి సూరన్న కవి ఇంచుమించుగా 1480-90 వ సంవత్సర ప్రాంతములయందు విష్ణుపురాణమును జేసెనని చెప్పవచ్చును.