పుట:Aandhrakavula-charitramu.pdf/702

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

675

నం ది మ ల్ల య్య , ఘం ట సిం గ య్య

వరాహపురాణమునకుఁ గృతీశ్వరుఁడైన నరసింగరాజుతండ్రియైన యీశ్వరరాజు సేనానాయకుఁడయి యుండి నట్టును, వీరిది తుళువాన్వయమయి నట్టును, చెప్పియున్నారు. ఈ నృసింహరాజునే నరసింగరాయఁ డనియు, పుస్తకములయందు వాడుదురు. ఈ యంశమును దెలుపు పద్యాదులలోఁ కొన్నిటిని వరాహపురాణమునుండి యిం దెత్తి చూపుచున్నాను.


        సీ. తుహినాంశువంశపాథోరాశీమాణిక్య
                         మష్టదిగ్రాజభయంకరుండు
            కర్ణాటరాజ్యరక్షణదక్షబాహాసి
                         వరవసంత త్యాగవైభవుండు
            శివరాత్రిసమయసంశీలతాగుణశాలి
                         ధరణీసుపర్వవిస్తారకుండు
            విరచితాతులతులాపురుషదానవిభూతి
                         సమదరాయకటారిసాళువంబు

            గుండవీడు నారసింహమండలేశ్వ
            రుండు గణుతింప రాజమాత్రుండు గాఁడు
            కిన్నరస్త్రీసమూహజేగీయమాన
            వర్తనంబులు గల చక్రవర్తి గాని.

            **** **** **** ****

      వ. అట్టి నరసింగరాజరత్నంబుచేత మన్నన వడసి సైన్యనాయకపట్టభద్రత్వంబున నిర్ని
         ద్రవిజయలక్ష్మీమహత్వంబున మదపదభియాతి భయదసత్వంబున
         దీర్ఘాయురైశ్వర్యధుర్యుండైన యీశ్వరనాయకునకుఁ
         బ్రియతనూభవుండు,నరసవసుధాధ్యక్షుండు నిర్వంచితానుగ్రహంబునం బరిగ్రహించిన
         యిమ్మహాప్రబంధంబునకు శృంగార విభూషణంబుగా తదీయవంశావతారంబు.

       సీ. ఉదయాద్రి భేదించె హుత్తరి నిర్జించె
                   గండికోటపురంబుఁ గదలఁ ద్రవ్వెఁ