పుట:Aandhrakavula-charitramu.pdf/686

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

659

పి ల్ల ల మ ఱ్ఱి పి న వీ ర న్న

కల్పింవఁ బడినది. ఈ కవి తనకు భారతీతీర్ధగురుకృపావిశేషముచేతఁ గవిత్వము వచ్చినట్లు జై మినిభారతమునందీ పద్యముచేతఁ జెప్పినాఁడు,

       సీ. పరగంగ మల్లమాంబాకుమారునకు సో
                           మకులాంబునిధిపూర్ణిమావిధునకు
          భరతకీర్తికిఁ దులాపురుషాదిదానాంబు
                           జంబాలితాస్థానసౌధునకును
          బరరాజభీకరధరణీవరాహున
                           కాత్రేయగోత్రపవిత్రునకును
          గుండయనరసింహమండలేశ్వరునకు
                           నభ్యుదయపరంపరాభివృద్ధి

          కరముగా భారతీతీర్థగురుకృపాస
          మృద్ధసారస్వతుఁడు సత్కవీంద్రసఖుఁడు
          కుకవిమల్లకషోల్ల సత్కులిశహస్త
          పల్లవుఁడు చెప్పెఁ బినవీరభద్రసుకవి.

ఈ కవి యనేక గ్రంథములను రచించెను గాని వానిలో నీ జైమినిభారతము గాక శృంగార శాకుంతల మొక్కటిమాత్రమే యిప్పుడు కానఁబడుచున్నది. కవి యా వఱకుఁ జెప్పిన గ్రంథములు శృంగారశాకుంతలములోఁ గృతిపతి కవిని గూర్చి చెప్పిన యీ క్రింది పద్యమునఁ బేర్కొనఁబడినవి.

      సీ. రచియించినాఁడవు రమణీయవా గ్రీతి
                         [1]నవతారదర్పణం బభినవముగఁ
         బలికినాడవు తేటపడఁజేసి నారదీ
                          యము సత్కవిశ్రేణి యాదరింపఁ
         జెప్పినాఁడవు శేముషీవిశేషంబున
                          మాఘమాహాత్మ్యంబు మంజుఫణీతిఁ

  1. [కొందఱు 'నవరస దర్పణం'బను పాఠమును గ్రహించిరి. కాని యా పాఠము సరియైనది కాదు. ]