పుట:Aandhrakavula-charitramu.pdf/685

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

658

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

స్నానసంధ్యాదులు లేక నోట మెతుకులు వడుటయే తడవుగా బోయి వేశ్యలయింటఁ గూరుచుండుచు వచ్చెననియు, అన్నగారు జపసమయము నందు దన భార్య కాభరణములు చేయించుట కాలోచించుచుండఁగా, తమ్ముడది గ్రహించి యాతనికోసర మెవరో వచ్చి 'మీ యన్న గారేమి చేయు చున్నా' రని యడిగినప్పుడు మా యన్నగారు భార్య కాభరణములు చేయించుటకయి యాలోచించు చున్నాఁడని యుత్తర మిచ్చె ననియుఁ జెప్పుదురు. అంతేకాక రాజు జై మీనీభారతమును జేయుటకై పినవీరభద్రున కాజ్ఞ యిచ్చి పంపునప్పు డతఁడు గడువులోపల సావకాశముగాఁ బుస్తకము రచియింపక యు పేక్ష చేసి యహోరాత్రములు భోగభామినుల యింట కాలక్షేపము చేయుచు వచ్చెననియు, మితిదినమునాఁటికీ గ్రంథమును జేసి సమర్పింపనియెడల రాజుచేత మాటవచ్చునని యన్నగా రెన్ని విధముల హితోపదేశము చేసినను, లక్ష్యముచేయక యాతని మాటలు పెడచెవులఁ బెట్టి యధేష్టముగాఁ దిరుగుచు వచ్చెననియు, పుస్తకము ముగింపవలసిన దినము ఱేపనఁగా నాటిరాత్రి తనగది యలికించి లోపల దీపము పెట్టించి పెందలకడ భోజనము చేసి గదిలోఁ బ్రవేశించి తలుపు లోపల వేసికొనఁగానే పదిమంది చేరి లోపల పుస్తకము వ్రాయుచున్నట్లు గంటముచప్పుడు వినఁబడెననియు, అద్భుతజనకమయిన యా చప్పుడు విని మనసు పట్టలేక పెదవీరన్న తలుపుసందునుండి తొంగి చూడగా సర్వాభరణభూషితురాలై దీపము వెలుతురున శరవేగముగ వ్రాయుచున్న యొక స్త్రీ బావగారు చూచు చున్నారని చివాలున లేచి తొలఁగిపోయెననియు, అటుపిమ్మటఁ బుస్తకమునఁ గొంచెము భాగము మిగులఁగాఁ బినవీరన్న దానిని పూర్తి చేసి మఱునాడు రాజసభకుఁ గొనిపోయెననియు, అతఁడు వాణీ నారాణి యని పంతము పలుకఁగాఁ గొలువులోనివారు సహింపక యాతని నిరాకరించి నప్పుడు వాణి నవరత్నఖచితము లయిన కంకణములు గదల తనహస్తము తెరలోనుండి పయికిఁ జాఁపి చూపి యాతనిమాట సత్యమని యశరీర వాక్కునఁ బలికె ననియుఁ జెప్పుదురు. ఆతడాశుధారగా కవిత్వము చెప్పఁగలవాఁడనియు, వాణి యతనికి పశ్య యనియు, చూపుటకై యీ కథ