పుట:Aandhrakavula-charitramu.pdf/684

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

657

పి ల్ల ల మ ఱ్ఱి పి న వీ ర న్న

రాజుతో నాతని యాస్థానమునందలి పండితు లన్నట్లు జైమినిభారతము నందుఁ జెప్పఁబడిన యీ క్రింది పద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.

    క. తాతయుఁ దండ్రియు నగ్ర
       భ్రాతయునుం దాను భువనభాసురకృతిని
       ర్మాతలు పిల్లలమఱివి
       ఖ్యాతునిఁ బినవీరుఁ బోలఁగలరే సుకవుల్.


    సీ. అమృతాంశుమండలం బాలవాలముగాఁగ
                       మొలచే నొక్కటి జగన్మోహనముగఁ
        జిగురించె విలయసింధు గతకైతవిడింభ
                       శయనీయవరపలాశములతోడఁ
        బితృదేవతలకు నంచితసత్రశాలయై
                       చెట్టు గట్టెను గయాక్షేత్రసీమ
        నిలువ నీడయ్యె నిందీవరప్రియకళా
                       కోటిరునకు భోగికుండలునకు

       మఱ్ఱిమాత్రంబె పిల్లలమఱ్ఱిపేరు
       పేరువలెఁ గాదు శారదాపీఠకంబు
       వారిలోపలఁ బినవీరువాక్యసరణి
       సరసులకు నెల్లఁ గర్ణ రసాయనంబు

శ్రీనాథాదులకుఁ దరువాతి కాలములో నుండిన వెల్లంకితాతంభట్టను లాక్షణికుఁడు తన కవిలోక చింతామణియందుఁ బినవీరనపద్యముల నుదాహరించుట కూడ నీ మహాకవి యించుమించుగా శ్రీనాథాదుల కాలమువాఁ డనుటను స్థాపించుచున్నది. కాఁబట్టి యిప్పటి కితఁడు నాలుగు వందల నలువది సంవత్సరముల క్రిందట నున్న వాఁడని చెప్పవచ్చును.

ఈ కవిమహిమలనుగూర్చి కొన్ని కధలు చెప్పుదురు, ఈతని యన్న నిష్ఠా పరుఁడయి జపతపములయందుఁ కాలక్షేపము చేయుచుండఁగా నితఁడు