పుట:Aandhrakavula-charitramu.pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

656

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

          గబ్పితనమునఁ దేజి మొగంబు గట్టి
          తఱిమి నగరంపుగవఁకులు విఱుగఁద్రోలి
          తాను వేసిన గౌరు నుద్దవిడిఁ దెచ్చె
          సాహసంబున నుప్పొంగు సాళ్వమంగు.

ఈ సాళ్వమంగు వీరబుక్కరాయని పుత్రుఁ డైన కంపరాయఁడు తండ్రి యాజ్ఞానుసారముగా 1367 వ సంవత్సర ప్రాంతమున దక్షిణదిగ్విజయ యాత్ర వెడలినప్పుడు సేనానాయకుడుగా నుండెను. నృసింహరాజుయొక్క ముత్తాతచే రాజ్యమున నిలుపఁబడిన సాంపరాయఁడు నృసింహరాజుతాత కాలములోఁగూడ రాజ్య మేలి యుండును. అప్పు డాతని పుత్రుఁడగు తెలుగుఁరాయఁడీ సృసింహరాజుయొక్క తండ్రి తాతల కాలములో నుండి యుండుటకు సందేహ ముండదు. యౌవనదశలోఁ దెలుఁగురాయనివద్దకుఁ బోయి కవిత్వము చెప్పి యాతనిని మెప్పించిన శ్రీనాధుఁడు నృసింహరాజు యొక్క తండ్రికాలములోనే కాక కొంతవఱకీ నృసింహరాజుయొక్క రాజ్య కాలములోఁ గూడ నుండి యుండును. కాఁబట్టి కృతిభర్త యైన యీ సాళువ నృసింహరాజును. కృతికర్త యైన పినవీరన్నయు శ్రీనాథుని యంత్యకాలములోను, తదనంతరకాలములోను జీవించియుండిన ట్లిందువలనఁ దేలుచున్నది. ఈ మహాకవి 1480 వ సంవత్సరప్రాంతమువఱకును జీవించి యుండవచ్చును గనుక, శ్రీనాధకవి వార్థకదశలో నున్నప్పు డితఁడు యౌవనదశయందుండి యుండును. దానినిబట్టి చూడఁగా శ్రీనాథుఁడు తానాంధ్రీకరించిన నైషధమును గొనిపోయి యిప్పుడు జనులనుకొనునట్లు కవిజనాగ్రగణ్యుఁడని యభినవముగాఁ బేరొందుచుండిన మహావిద్వాంసుఁడయిన పినవీరన్నకుఁ జూపి యుండును. పినవీరభద్రుని జీవితకాలములోనే శ్రీనాథుఁ డాతనికిఁ బూర్వకవి యయినందున శృంగార శాకుంతలకృతిపతి యయిన వెన్నమంత్రి "సీ. శ్రీనాథభట్టభాషానిగుంభంబుల పరిమళంబులఁ గూడఁ బఱవ నేర్చు” నని పినవీరనకవిత్వమును శ్లాఘించెను. ఈ వీరభద్రకవి యా కాలమునందు మిక్కిలి సుప్రసిద్దుఁ డయినట్లు నరసింహ