పుట:Aandhrakavula-charitramu.pdf/682

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

655

పి ల్ల ల మ ఱ్ఱి పి న వీ ర న్న


యుండి ప్రభుదత్త సంస్థాన పరిపాలకులయి యుండిరి. పిల్లలమఱ్ఱి పినవీరన్న 1480 వ సంవత్సర ప్రాంతమున జైమినిభారతము నీతని కంకితముచేసి యుండును. వరాహపురాణమునందలి యవతారికనుబట్టి సాళువ గుండ నర సింహునికాలము స్పష్టమగా దెలియవచ్చుచున్నది. కృష్ణ దేవరాయల తాత యైన యీశ్వరరాజీనరసింహనృపాలునియొద్ద దండనాథుఁడుగా నున్నట్లా పురాణపీఠికయందుఁ జెప్పఁబడినందున, సాళువగుండ నరసింహరాజును తధాస్థానకవీశ్వరుఁ డయిన పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడును గ్రీస్తుశకము 1450 - 80 వ సంవత్సరప్రాంతముల యందున్నట్లేర్పడుచున్నది. ఈ కవికాలమును నిర్ణయించుట కొక విధమైన యాధార మింకొకటి కానఁబడు చున్నది. శ్రీనాధుఁడు రాజమహేంద్రపురెడ్ల యాస్థానములోఁ జేరకమునుపు సాంపరాయని కుమారుఁ డయిన తెలుఁగురామునివద్దకుఁ బోయ కస్తూరి వేఁడినట్లీ క్రిందపద్యము తెలుపుచున్నదిగదా?

     శా. అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
         భిక్షాదానము చేయురా సుకవీరాడ్బృందారకస్వామికిన్
         దాక్షారామపురివిహారవరగంధర్వాప్సరోభామినీ
         వక్షోజద్వయకుంభకుంభముల పై వాసించుఁ దద్వాసనల్.

ఈతెలుఁగురాయనితండ్రి యగు సాంపరాయనికి జైమినీభారతకృతిపతియగు సృసింహరాజుయొక్క ముత్తాత యగు సాళువమంగరాజు రాజ్య ప్రతిష్టాపనము చేసినట్లు జైమినిభారతములో నీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది.

      సీ. దురములో దక్షిణసులతాను నెదిరించి
                              కొనివచ్చి సాంపరాయనికి నిచ్చి
          సామ్రాజ్యమున నిల్పి సాంపరాయస్థాప
                              నాచార్యబిరుదవిఖ్యాతి గాంచె
          శ్రీరంగవిభుఁ బ్రతిష్టించి యర్వదివేల
                              మాడ లద్దేవు నుమ్మడికి నొసఁగె
          మధురాసురత్రాణు మడియించి పరపక్షి
                              సాళువబిరుదంబు జగతీ నెరపె