పుట:Aandhrakavula-charitramu.pdf/679

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

652

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

హృదయంగమముగా నున్నది. రత్నశాస్త్రమగస్త్యుఁడు సంస్కృతమున రచించిన మణిలక్షణమునకుఁ దెనుఁగని యీ పద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.

      క. తన్నుఁ బ్రియమార వేడిన
         మున్ను మునీంద్రుల కగస్త్యముని చెప్పిన యా
         సన్నుతమణిలక్షణములు
         చెన్నుగఁ గ్రోడీకరించి చెప్పెదఁ తెలియన్

ఈతని గ్రంథములలో నొక్కొక్కదానినుండి రెండేసి పద్యముల నిందుదాహరించుచున్నాను.

1. శ్రీరంగమాహాత్మ్యము.

      చ. తలపులు నిక్క నిక్కపుముదమ్ములఁ దమ్ముల సంచలించు న
          య్యలులకు లోఁగి లోఁ గినుకనందెద నందెద వేల చంపకా
          వల్ వలి నున్న మొగ్గ లనివారణ వారణయాన కోయు మిం
          పలరఁగ దానఁ దేటి రస మానదు మానదు లేఁతపూవులన్.

      ఉ. ధీరులు దోషదూరులు సుధీజనసంస్తవనీయసద్గుణో
          దారు లుదారు లాహవజితప్రతివీరు లపూర్వనిత్యశృం
          గారులు శూరులు జ్ఝితవికారులు వార్థిగభిరు లంగనా
          మారులు శక్తినిర్జితకుమారులు రాజకుమారు లప్పురిన్

2. రత్న శాస్త్రము.

      ఉ. నీరదము ల్దిగంతముల నిండి తటిద్ఘనగర్జితంబు లిం
          పార మహోగ్రవృష్టి గురియం బ్రభవించు నితాంతకాంతితో
          నారయఁ గుక్కుటాండసమమై పడు ముత్యము లంతరిక్షసం
          చారులు పట్టుకొందురు వెసన్ వసుధం బడకుండ నేర్పునన్.