పుట:Aandhrakavula-charitramu.pdf/677

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

650

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

గౌరనమంత్రిపుత్రుఁ డేమో యని యూహ కలుగుచున్నది. గౌరనమంత్రి గౌతమగోత్రుడగుటయు, బ్రౌఢ దేవరాయలకాలములో నుండుటయు నీ యూహను మఱింత బలపరుచుచున్నవి గాని నిజముగా తనతండ్రి గొప్ప కవీశ్వరుఁడై యుండినపక్షమున భైరవకవి యా విషయమును దన గ్రంథమునందుఁ జెప్పఁడా యని సందేహము పొడముచున్నది. ఈ సందేహము మాట యటుండఁగా గౌరనామాత్యుఁడు భైరవామాత్యునికుమారుఁ డనుట కొక గొప్ప యాక్షేపణ కనఁబడుచున్నది. భైరవుఁడు కవిగజాంకుశమును రచించెను గదా ! గౌరనమంత్రి తాను రచించిన లక్షణదీపికలో కవిగజాంకుశములోని పద్యముల నుదహరించెను. తండ్రి తాను చేసిన గ్రంథములో కుమారుఁడు ముందు చేయబోయేడు గ్రంథములోని పద్యముల నుదాహరించుట సంభావ్యము కాదుగదా ? అందుచేత లక్షణదీపికలో నుదహరింపఁ బడిన కవిగజాంకుశము భైరవునిది గాక మఱియెవ్వరిదైనఁ బూర్వకవిదయియైన నుండవలెను; లేదా, గౌరనమంత్రి కి భైరవుఁడు కుమారుఁడైనఁ గాకుండవలెను. లక్షణదీపికలో నుదాహరింపఁబడిన కవిగజాంకుశమిది గాక యెప్పటిదో పూర్వపుదనియు, వివిథ దేశములనుండి సంపాదించిన తమ యొద్ది నాలుగు( భైరవకవికృత) కవిగజాంకుశ ప్రతులలోను లక్షణదీపికలో నుదాహృతములైన పద్యములు లేవనియు శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు చెప్పుచున్నారు. అల్పకాలములోనే కవిగజాంకుశనామము గల గ్రంథములు రెండు పుట్టె ననుటయు, నంత నమ్మదగినదిగా లేదు. దీనికి సమాధానముగా నొకటి కవిగజాంకుశ మనియు నింకొకటి కవిరాడ్గజాకుశ మనియుఁ జెప్పుదురు. ఇది యంతతృప్తికరమయిన హేతువు గాదు. అయినను గౌరన, భై రవకవుల కాల మించుమించుగా సరిపోవుచున్నది గనుకను, ఇరువురును గౌతమగోత్రులే యగుటచేతను,భై రవకవితండ్రీ యెవ్వరో గౌరనయే యగుటచేతను ప్రమాణాంతరములవలన నన్యధా సిద్ధాంత మగువఱ